వంటగ్యాస్ సిలిండర్ల సబ్సీడిని స్వచ్చందంగా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే ఉద్యమంలో తాహత్తు వున్నవారంతా చేరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మార్కెట్ ధరలకు గ్యాన్ ను కోనుగోలు చేసే శక్తి వున్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. ఆ నిధులను నిజమైన పేదల అభ్యున్నతికి వినియోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం మనం ఇంధనం కోసం 77 శాతం దిగుమతుల మీదే ఆధారపడుతున్నామని, 2022 నాటికి విదేశాల ఇంధన దిగుమతులను పది శాతం మేర తగ్గించి.. వారిపై ఆధారపడకుండా చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్పీజీ రాయితీ వదులుకునే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించిన నరేంద్రమోడీ ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు.
తన పిలుపుకు స్పందించిన 2.8 లక్షల మంది మంది వినియోగదారులు తమ సబ్సిడీలను వదులుకోవడం వల్ల ఖజానాకు రూ. 100 కోట్లు ఆదా అయ్యిందని చెప్పారు. ఇలా ఆదా చేసిన సొమ్ముతో వాళ్లకు స్వచ్ఛమైన ఇంధనాన్ని పొందే అవకాశం ఉంటుందని మోదీ అన్నారు. అభివృద్ధికి ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరమని పేర్కొన్నారు. ప్రధాని జన ధన యోజన పథకం కింద ఇప్పటికి దేశంలోని 12 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నారని, ఎక్కడ ఎలాంటి అవినీతికి అస్కారం లేకుండా సంబంధిత లబ్దిదారులు ఖాతాల్లోకే నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా గ్యాస్ సబ్సిడీ మొత్తం బదిలీ అవుతుందని మోదీ తెలిపారు. నాలుగేళ్లలో కోటి కుటుంబాలకు పైపుల ద్వారా వంటగ్యాస్ కనెక్షన్ అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more