తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం చిలిచిలికి గాలి వానగా మారుతోంది. నాగార్జున సాగర్ నీటిని విడుదల చెయ్యడానికి వచ్చిన ఆంధకనప్రదేశ్ నీటి పారుదల అధికారులు రావడం, వారిని తెలంగాణ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రక్తత నెలకొంది. అటు గుంటూర్, నల్గొండ జిల్లాలకు చెందిన పోలీసులు సాగర్ వద్దకు చేరుకున్నారు. అధికారులు వాగ్వాదానికి దిగగానే, వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. పోలీసులు తమ లాఠీలను ఝులిపించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఒకరిపై మరొకరు ప్రతాపాన్ని చూపించుకున్నారు. దాంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అయితే రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులకు అధికారులు ఫోన్లు చేశారు. ఏపి సిఎం చంద్రబాబు తెలంగాణ సిఎం కెసిఆర్ కు ఫోన్ చేశారు. సాగర్ వివాదంపై గవర్నర్ తో భేటి అవుదామని ఇద్దరు ముఖ్యమంత్రులు ఓ ఒప్పందానికి వచ్చారు. దాంతో అధికారులు శాంతించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గవర్నర్ భేటిలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణకు చెందిన అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోపక్క కృష్ణా నీటి యాజమాన్య బోర్డ్ వైఖరి రెండు రాష్ట్రాల మధ్య మరింత వివాదాలకు చోటిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కోరిన విధంగా కుడి కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చెయ్యాలని సూచించినట్లు కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డ్ తెలిపింది. కానీ తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని వాదిస్తున్నారు. ఈ వివాదంపై నిజానిజాలను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు నివేదించినట్లు బోర్డు తెలిపింది. రెండు రాష్ట్రాలు తాము అడిగిన సమాచారాన్ని ఇవ్వడం లేదని ఆరోపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more