తరుచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లాగే విమానాలు కూడా కుప్పకూలిపోతున్నాయి. ఇటీవలే ఎయిర్ ఏషియా q8501 విమానం వాతావరణ పరిస్థితుల కారణంగా అదుపు తప్పి సముంద్రంలో పడి కూలిపోగా.. తాజాగా ట్రాన్స్ ఏషియా సంస్థకు చెందిన ఓ విమానం నదిలో పడి కుప్పకూలిపోయింది. వాతావరణంలో ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ.. ఈ విమానం కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ట్రాన్స్ ఏషియా సంస్థకు చెందిన ఈ విమానం.. తైవాన్ రాజధాని తైపీలో నదిలో పడి కూలిపోయింది. ప్రమాదానికి ముందు ఈ విమానం ఒక రోడ్డు బ్రిడ్జిని ఢీకొట్టడ వల్ల అదుపు తప్పి నదిలో పడిపోయిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 58 మందికిపైగా ప్రయాణికులు వున్నట్లు సమాచారం! అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది విమానంలో చిక్కుకున్నవారిలో 10 మందిని సురక్షితంగా బయటకు తీశారు. గాడపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి పరిస్థితి ఎలా వుందో ఇంకా తెలియాల్సి వుంది. కొందరు చనిపోయి వుంటారని అధికారులు తెలుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ విమానం నదిలో మునిగిపోయే దృశ్యాన్ని తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ చిత్రీకరించింది.
ఇదిలావుండగా.. వాతావరణంలో ఎటువంటి మార్పులు లేకపోయినా ఈ విమానం కూలడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక రోడ్డు బ్రిడ్జిని ఢీకొట్టేరకంగా పైలట్ విమానాన్ని ఎందుకు నడిపాడని కొందరు నిలదీస్తున్నారు. పైలట్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని అంటున్నారు. మరోవైపు.. సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల పైలట్ కన్ఫ్యూజన్’కు గురయి వుంటాడని, ఆ సమయంలో టెన్షన్’తో నడపపంలో తడబడి వుంటాడని, అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడిస్తున్నట్లు సమాచారం!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more