ISIS ఉగ్రవాదులు రానురాను మరీ ఘోరమైన దారుణాలకు ఒడిగడుతోంది. నిన్నటికినిన్నే జపాన్ జర్నలిస్టును కిరాతకంగా చంపేసిన ఈ ఉగ్రవాదులు.. ఇప్పుడు తమ దగ్గర బందీగా వున్న జోర్డాన్ పైలట్’ను చాలా దారుణంగా హతమార్చారు. మోజ్ అల్ - కసస్ బెహ్ అనే ఈ జోర్డాన్ పైలట్’ను ఐసిస్ ఉగ్రవాదులు మొదటగా ఆ పైలట్’పై మండే ద్రవ్యపదార్థాన్ని పోసి ఒక బోనులో కట్టేశారు. అనంతరం అతనికి మంటలు అంటించి సజీవదహనం చేసినట్లుగా వున్న వీడియోను ఉగ్రవాదులు విడుదల చేశారు.
గత సంవత్సరం డిసెంబర్’లో సిరియాలోని రక్కా సమీపంలో ఈ జోర్డాన్ పైలట్’ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అయితే.. ఇతనిని విడిపించుకునేందుకు జోర్డాన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. తమ పైలట్ అల్ - కసస్ బెహ్ విడిచిపెడితే తమ వద్ద బందీగా వున్న ఐసిస్ మహిళా నేతను విడుదల చేస్తామని జోర్డాన్ గతంలో చాలాసార్లు ప్రకటించింది. అయితే.. ఉగ్రవాదులు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సదరు పైలట్’ను సజీవదహనం చేసేసి.. ఇప్పుడు ఆ వీడియోను అప్’లోడ్ చేశారు. దీంతో ఇది సంచలనంగా మారింది.
అటు తమ పైలట్’ను సజీవదహనం చేసినట్లుగా విషయం తెలియగానే జోర్డాన్ ప్రభుత్వం వెంటనే ప్రతీకారంగా ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను ఉరితీసింది. అనంతరం తమ పైలట్ కసస్ బెహ్ నిజమైన హీరో అంటూ జోర్డాన్ రాజు అబ్దుల్లా కొనియారు. మరోవైపు తన భర్తను ఈ విధంగా సజీవదహనం చేయడంపై ఆ పైలట్ భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో తన భర్తను విడిపించాల్సిందిగా ఆమె ఎన్నోసార్లు వేడుకుంది కూడా!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more