Kcr delhi tour

kcr delhi tour, kcr , delhi , telangana, trs party, t news , telangana political issues

kcr met prime minister modi, central ministers and president. he has told some state isuues to over them

ఢిల్లీ లో పెద్దోల్లను కలిసిన కెసిఆర్

Posted: 12/09/2014 10:59 AM IST
Kcr delhi tour

తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ కెసిఆర్ గారు తన రెండు రోజుల ఢిల్లీ అధికారిక పర్యటనని పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ లో బిజీ బిజీ గ గడిపిన కెసిఆర్ అనేక మంది ప్రముఖులను కలిసి రాష్ట్రానికి సంబధించిన పలు సమస్యలను.., పలు విన్నపాలను వారి ద్రుష్టి కి తీసుకెళ్ళారు. రాష్ట్రపతిని, వివిధ కేంద్ర మంత్రులను కలుసుకున్న కెసిఆర్ మోడీ తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర  విద్యుత్ శాఖా మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ ని కలిసి ఇపుడు ప్రస్తుతం రాష్ట్రానికి ప్రధాన సమస్య గ ఉన్న విద్యుత్ కొరత ని అధిగమించేందుకు సహాయ పడాలని అభ్యర్తించారు. అందుకు కేంద్ర మంత్రి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మహబూబ్ నగర్ లో 1000 మెగా వాట్ల సోలార్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రానికి  సంబధించిన సమస్యల కోసం కేంద్రం లో ఉండే అందరి పెద్దోల్లను కలిసాడు కాని పూజారి కనికరించినా కాని దేవుడు అనుగ్రహించలేదన్నట్లుగా.., పెద్దోల్లందరూ ఆయన చెప్పిన వాటికి సరే అని చిరునవ్వు చిందించారు కాని వీళ్ళందరికీ పెద్ద అయిన మోడీ కరుణిస్తాడో లేదో చూడాలి మరి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  kcr delhi tour  narendra modi  telangana state  

Other Articles