రాష్ర్ట అభివృద్ధి ప్రధాన ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. రెండ్రోజుల పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు కేటాయింపులపై విజ్ఞప్తులు చేస్తున్నారు. చివరి రోజైన సోమవారం కూడా వరసగా అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేసుకున్నారు. విభజన సమస్యలు, రాష్ర్ట అభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న పర్యటనకు కేంద్ర నేతలు కూడా బాగానే మద్దతు ఇస్తున్నారు. కేసీఆర్ చెప్పే విజ్ఞప్తులు ఓపిగ్గా వింటున్నారు.
చివరి రోజైన ఇవాళ సీనియర్ కేంద్రమంత్రులను కేసీఆర్ కలుస్తారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటుకు వెళ్లిమరీ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇందన శాఖ మంత్రి పియూష్ గోయల్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలను కలుస్తారు. హోంమంత్రితో సమావేశమై ఐఏఎస్ ఐపీఎస్ ల విభజనపై చర్చిస్తారు. రాష్ర్టం ఏర్పడి ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు అధికారుల విభజన జరగకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలపనున్నారు. అదేవిధంగా పదవి షెడ్యూల్ లోని ఉమ్మడి సంస్తల విభజన ఇతర అంశాలను ప్రస్తావించనున్నారు.
ఇక పియూష్ గోయల్ తో సమావేశం సందర్బంగా తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని కోరనున్నారు. దక్షిణిదా గ్రిడ్ నుంచి ఈ విద్యుత్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు. ఇక కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించి., ప్యాకేజి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రత్యేక నివేదికను జైట్లికి అందిస్తారు. అటు ఉమాభారతితో సమావేశమై రాష్ర్ట నీటి సమస్యలు, కేటాయింపుల్లో ఇబ్బందులను వివరించనున్నారు. గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు. అయితే వాటి ఫలాలు మాత్రం ఇప్పటివరకు అందలేదు. మరి ఈ పర్యటన అయినా ఏ మేరకు హామిలు తెప్పిస్తుందో..., ప్రకటనలుు చేయిస్తుందో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more