వాడే.. నా మొగుడు, కాదు కాదు నా ప్రియుడు..! ఇదేదో సినిమా పాటో, లేక కథో అనుకుంటే పోరబాటే.. ఇద్దరు మహిళలు మగాడి కోసం పాకులాడే అరుదైన సన్నివేశం.. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ కనిపించడం సాధారంగా మారింది. అయితే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఓ కానిస్టేబుల్ కోసం పోట్లాడుకునే అరుదైన సన్నివేశం మాత్రం అరుదుగా జరుగుతుంది. చట్టం తెలిసిన వాళ్లు, చట్టలాను పరిరక్షించాల్సిన వాళ్లు.. ఏకంగా చట్టం కళ్లు గప్పి తప్పులు చేస్తుంటే.. ఎవరు మాత్రం సహిస్తారు. అందుకనే గుంటూరు జిల్లా ఎస్పీ వారిద్దరి సస్సెండ్ చేశారు.
ఇంతకీ వీరిద్దరు ఎందుకు పోట్లాడుకున్నారో తెలుసా..? ఒకరు భర్త కోసం.. మరోకరు ప్రియుడి కోసం. వాష్ శబాష్ అనాలనిపిస్తోందా..? తన భర్త వెస్లీతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మీ వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రమావత్ శ్రీదేవి ఆరోపించింది. విజయలక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భర్త.. తనతో పాటు తన పిల్లలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాల్సిందిగా పట్టాభిపురం పోలిస్ స్టేషన్ ఎదుట తన తల్లితో కలసి ధర్నకు దిగింది.
అక్కడ విజయలక్ష్మిని చూడటంతో కోపాన్ని వెళ్లగక్కింది. అది కాస్తా శృతిమించి ముష్టిగాతల వరకు వెళ్లింది. చాలా అరుదుగా దోరికే అవకాశం అనుకున్నారో ఏమో కానిస్టేబుల్ ట్రైనింగ్ లో ఇచ్చిన శిక్షణను మొత్తం చూపించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ విజయలక్ష్మీ గాయపడగా, అమెను చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. శ్రీదేవి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన కానిస్టేబుల్ వెస్లీని అదుపులోకి తీసుకున్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటనపై ఎస్పీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. కానిస్టేబుళ్లు శ్రీదేవి, విజయలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more