మహారాష్ట్రలో ఎన్నికల వేళ.. పోలింగ్ జరుగుతుండగా, ఓటరు మహాశయులను ఎలాంటి ప్రభావాలకు గురి చేయకూడదన్న నిబంధనలు తెలిసి కూడా.. శివసేన సాహసానికి ఒడిగట్టంది. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలకు పూనుకుంది. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. శివసేన భారీ పత్రికా ప్రకటనలతో సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ రోజు ఇలా ప్రకటనలు ఇవ్వకూడదు. కానీ, బాల ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేల ఫొటోలు, బాణం గుర్తుతో భారీ ప్రకటన ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తామే ప్రధాన పోటీదారులం అన్నట్లుగా ఈ ప్రకటనలు గుప్పించింది.
తమ పార్టీ అధికారిక పత్రికలైన సామ్నా, దోపహర్కా సామ్నా పత్రికల్లో ఇవాళ్టి ఎడిషన్ మొదటిపేజీలో పూర్తి పేజీ ప్రకటనలతో గుప్పించింది. 'ధనుష్య బాణ్ కీ టంకార్ హై, అబ్ అప్నీ సర్కార్ హై' అని ఇందులో నినాదం ఇచ్చింది. ధనస్సు, బాణం శివసేన ఎన్నికల గుర్తు. వాటిని గుర్తు చేసేలా.. ఈసారి అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ ఈ ప్రకటన ఇచ్చింది.
దీంతో పాటు ముంబైలోని ఇతర మీడియా సంస్థలకు మరో రకం పెద్ద ప్రకటన ఇచ్చింది. అందులో అయితే.. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకునేలా ప్రకటనలు వున్నాయి. ''రావణుడిని.. శ్రీరాముడు హస్తంతో (కాంగ్రెస్ గుర్తు), వాచీతో (ఎన్సీపీ) లేదా పువ్వుతో (బీజేపీ)తో చంపలేదని.. ధనస్సుతో బాణం వేసి చంపారంటూ ఆ ప్రకటనలో ఉంది. అవినీతి, విద్యుత్ కోతలు, విధాన సంక్షోభం, దుష్పరిపాలన.. వీటన్నింటినీ అరికట్టాలంటే ధనస్సు, బాణాలకు ఓటు వేయాలన్నది శివసేన ఓటర్లను కోరింది. శివసేన ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మహారాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారిందించి. ప్రకటనలు జారీ చేసిన శివసేనతో పాటు.. శివసేన అధికార పత్రిక సామ్నా సహా ప్రకటనలు ఇచ్చిన అన్ని పత్రికలపై చర్యలకు పూనుకుంటోంది. పోలింగ్ కార్యక్రమాలలో ఎలాంటి విఘాతం కలగకూడదని మిన్నకున్న ఎన్నికల సంఘం ఇవాళ సాయంత్రం నాటికి చర్యలను ప్రకటించే అవకాశం వుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more