హుద్హుద్ తుపాను ధాటికి విలవిలలాడిన బాధితుల పట్ల టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ సినీ పరిశ్రమ ఔదార్యం చూపింది. పలువురు సినీ పరిశ్రమ పెద్దలు, నటులు తుపాను బాధితులకు తమ వంతు ఆర్థిక సాయం అందజేశారు. తెలుగు సినీపరిశ్రమ అగ్ర కథనాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తుపాను బాధితుల కోసం 30 లక్షల విరాళం ప్రకటించారు. త్వరలోనే తన విరాళాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు బాధితులకు 15 లక్షల రూపాయల విలువైన బియ్యం, నిత్యావసరాలు అందజేయనున్నట్లు ప్రకటించారు.
అటు బాధితులకు తమవంతు ఆర్థిక సాయంగా అక్కినేని ఫౌండేషన్, యువ కథనాయకుడు నితిన్ కూడా తమ విరాళాలను ప్రకటించారు. అక్కినేని ఫౌండేషన్ ద్వారా రూ.20 లక్షల ఆర్థక సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపనున్నట్లు తెలిపారు. అటు హీరో నితిన్ కూడా ఆర్తులకు సాయం అందించారు. తుపాను బాధితుల కోసం 10 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి అందిస్తానన్నారు.
నిన్న రాంచరణ్ తో మొదలైన విరాళాల వెల్లువ ఇవాళ కూడా కొనసాగింది. తుపాను బాధితుల కోసం అగ్రహీరో రవితేజ 10 లక్షల రూపాయలు, ప్రకాష్ రాజ్ ఐదు లక్షల రూపాయలు, కమేడియన్ హీరో అల్లరి నరేష్ ఐదు లక్షలు, హాస్యనటుడు బ్రహ్మానందం 3 లక్షలు, యువ కథానాయకుడు సందీప్ కిషన్ రూ. 2.5 లక్షలు, సినీనటి రుకూల్ ప్రీతిసింగ్ లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
అటు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను బీభత్సంపై కొలీవుడ్ నటులు కూడా స్పందించారు. తమ వంతు ఆర్థిక సహాయంగా బాధితులకు విరాళాన్ని ప్రకటించారు. తమిళ హీరో సూర్య కుటుంబం హుదూద్ బాధితులకు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సూర్య 25 లక్షలు, కార్తీ 12.5 లక్షలు, జ్ఞాన్వేల్ రాజా 12.5 లక్షల విరాళం అందిస్తున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు మేము సైతం అంటూ బాధితులకు ఆదుకునేందు ఆపన్నహ్తాన్ని అందిస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more