గతకొన్ని రోజులనుంచి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన కరెంట్ కోతలు, రైతు రుణమాఫీలు, ఇతర సంక్షేమ పతకాల గురించి సీఎం కేసీఆర్ ఇంకా విశ్లేషణ ఇవ్వపోవడంతో ఆ రాష్ట్ర ప్రజలు ఆయన మీద నిప్పులు చెరిగిన విషయం అందరికీ తెలిసిందే! ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ.. దిష్టబొమ్మను దహనం చేయడం, రాస్తారోకోలు లాంటి కార్యక్రమాలను చేపట్టారు. నిన్నమొన్నటివరకు ఈ వ్యవహారం అలాగే కొనసాగించింది కానీ.. తాజాగా ఆయన ఇచ్చిన ప్రకటనతో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలారోజుల తర్వాత ఆయన ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణకోసం ఎన్నో ఉద్యమాలను చేపట్టిన నేపథ్యంలో తమ ప్రాణాలను సమర్పించిన అమరవీరులు ఎంతోమంది వున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ ప్రభుత్వం ఏర్పడితే వారి కుటుంబసభ్యులకు ఆర్థికసహాయంతోపాటు కుటుంబంలో వున్న ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఆ విషయంలో మొదట్లో విశ్లేషణ ఇవ్వలేకపోయినా.. తాజాగా ఆయన వారికి ఆర్థికసహాయాన్ని అందిస్తున్నట్లుగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల నివేదిక ఆధారంగా తొలివిడతగా రూ.4602 కోట్లను విడుదల చేయనున్నారు. ఈ నిధులను 462 అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా అందివ్వనున్నారు.
అలాగే తెలంగాణ రైతులకు కూడా ఒక శుభవార్తను వెల్లడించారు. రాష్ట్రంలో వున్న విద్యుత్ కోతలను దృష్టిలో పెట్టుకుని ఆయన వారం రోజులవరకు వ్యవసాయానికి విద్యుత్ కోత లేకుండా చూడాలని.. అందుకు ఎంతరైటు పెట్టైనా సరే విద్యుత్ ను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే త్వరలోనే రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ వుండేలా ప్రణాళికలను చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. దీంతో ప్రజలందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తి, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more