ఎప్పుడో 2002వ సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ఆ రాష్ట్రంలో హిందూ-ముస్లిం వర్గాల మధ్య జరిగిన గోద్రా అల్లర్ల గురించి అందరికీ తెలిసిందే! ఆ అల్లర్లు చేయించింది మోడీయేనంటూ ఆ రాష్ట్రంలో వున్న ముస్లిములతోపాటు ఇతర పార్టీలు కూడా ఆరోపణలు చేశారు. అయితే ఆ తరవాత ఆ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కోర్టు.. ఆ అల్లర్లకు, మోడీకి ఎటువంటి సంబంధం లేదంటూ తేల్చి పారేసింది. అయనప్పటికీ మోడీ మతతత్వ నాయకుడంటూ అప్పటినుంచి ముద్రపడిపోయింది. అది వేరే విషయంలేండి! ఇప్పుడు తాజాగా మరోసారి మోడీ ప్రధానమంత్రి అయిన కొన్నిరోజుల తర్వాతే ఆ రాష్ట్రంలో అల్లర్లు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.
గుజరాత్ లోని వడోదరలో అనుకోకుండా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సోషల్ మీడియాలో ఒక వర్గంవారు మరో వర్గంవారి మనోభావాలను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడంతో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నాలుగురోజులపాటు మొబైల్ ఫోన్ ఇంటర్నెట్, మొబైల్ మెసేజ్ సర్వీసులను నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగ్రమంతో రెచ్చిపోయిన ఆ రెండువర్గాలు ఒకరిమీద మరొకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులపై కూడా మరికొందరైతే పైత్యం పెచ్చుమీరి వారిమీద దాడికి పాల్పడ్డారు. కొందరు ఏకంగా పోలీసుల వాహనాలనే నిప్పు పెట్టేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి భాష్పవాయువును ప్రయోగించారు. ఈ అల్లర్లలో పోలీసులు దాదాపు 200 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం ఉదయానికి వడోదరలో ప్రశాంత వాతావరణమే నెలకొందని అధికారులు వెల్లడించారు.
అనుకోకుండా ఇలా రెండువర్గాల మధ్య ఘర్షణ జరగడంపై కొంతమంది రాజకీయ విశ్లేషకులతోపాటు ప్రత్యర్థ నాయకులు రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొన్నిరోజులకే గుజరాత్ లో అల్లర్లు జరగడం.. ఇప్పుడు కూడా ప్రధాని అయిన కొన్నిరోజులకే ఇలా రెండువర్గాలు దాడి చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయని పేర్కొంటున్నారు. అలాగే మోడీ అమెరికా పర్యటనలో వుండగా.. ఆయన సొంత రాష్ట్రంలోనే ఘర్షణలు చోటు చేసుకోవడం విశేషంగా మారింది. మరి దీనిపై మోడీ ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more