ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొట్టకొట్టే పని చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏడు లక్షల మంది వృద్ధులు కడుపు చంపుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే లక్షఎకరాలు అంటూ రైతుల భూములు లాగేసుకోవటానికి కమిటి ఏర్పడగా.. వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ లో కూడా భారీ మార్పులు చేసింది. అనర్హులు అంటూ దాదాపు ఏడు లక్షల మంది పేర్లను పెన్షన్ జాబితా నుంచి తొలగించింది. వీరందరికి అక్టోబర్ 2 నుంచి పెన్షన్ రాదు. అంటే కాటికి కాళ్ళు చాపిన ముసలివారిని ప్రభుత్వం కాస్త త్వరగా పంపించేందుకు కంకణం కట్టుకుంది అనే విమర్శలు వస్తున్నాయి.
వృద్ధాప్యంలో తన అనుకున్న వారు ఆదుకోకపోయినా.., అవసరం కోసం పని చేద్దామన్నా శరీరం సహకరించదు. ఆరుపదుల వయస్సు దాటిన ముసలి వారు ఏమి చేయలేరు. అందుకే వారిని ఆదుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ పధకం తీసుకువచ్చింది. ఈ పధకం కింద ప్రతి నెలా.., రూ.200 ఇస్తోంది. అది వారికి ఏ మాత్రం సరిపోదు. కనీసం మందుల ఖర్చులకు కూడా రాదు. కానీ ఏదో ఇచ్చాము అని చెప్పుకోవడానికి ఉండాలి కదా. అయితే విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ ను భారీగా పెంచింది. రూ. 200 నుంచి ఏకంగా రూ.1000 కి పెంచారు. పేద వృద్ధులు ఎవరిపై ఆధారపడకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా మంత్రులు గొప్పలు చెప్పారు. ఈ పధకాన్ని అక్టోబర్ 2నుంచి అమల్లోకి తెచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.
అభాగ్యులకు అన్యాయం
అయితే వృద్ధాప్య పెన్షన్లపై తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ర్టంలో 7లక్షల మంది పెన్షన్ కు అనర్హులు అంటూ ప్రభుత్వం లెక్కలు తేల్చింది. వారందరికి అక్టోబర్ 2నుంచి పెన్షన్ కట్ చేస్తున్నారు. అంటే వెయ్యి రూపాయల మాట దేవుడెరుగు కానీ.. కనీసం రెండు వందల రూపాయలు కూడా ఆ ఏడు లక్షల మందికి రావన్న మాట. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు అక్రమాలు జరిగాయని పలు ఉదాహరణలు చెప్తోంది. అందులో ఒకటి చూస్తే.. ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ కధ. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రికి పెన్షన్ వస్తుందని.., ఆయన కూడా ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆయనకు పెన్షన్ రాకూడదు. ఇలాంటి వారు ఉండవచ్చు. కానీ తొలగించిన జాబితాలో అంతా ఇలాంటి అక్రమంగా పెన్షన్ పొందే వారే ఉన్నారని మాత్రం చెప్పలేము. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు.
నోటి దగ్గర కూడు లాగేశారు
అక్రమాలను అడ్డుకుంటామంటూ చేపట్టిన పెన్షన్ కొత్త లిస్ట్ రూపకల్పనలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేరుకు అధికారులు అనర్హుల జాబితా తయారు చేసినట్లు చెప్తున్నా.., వాటి రూపకల్పనలో మాత్రం టీడీపీ కిందిస్థాయి నేతలు కీలక పాత్ర పోషించారు. తమ పార్టీకి ఓటేయని.., అవసరం రాని వారు వాస్తవంగా అర్హులైనా.., పేర్లను మాత్రం తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాత లిస్ట్ లో ఉన్న వారిలో తమకు వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను తొలగించి కొత్త జాబితాను టీడీపీ వార్డుమెంబర్లు, నేతలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు తయారు చేశారని విమర్శలు వస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం పెన్షన్ కట్ నిర్ణయం తీసుకుంది. వీరి స్వార్ద ప్రయోజనంతో సగం మంది వృద్ధుల నోటి దగ్గరి కూడు లాగేశారు. లిస్ట్ తయారు చేస్తున్నామనే సాకుతో.., మూడు నెలల ముందునుంచే పెన్షన్ ఆపేశారు. కేవలం పెన్షన్ పైనే ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటి..? దీనికి చంద్రబాబు సమాధానం చెప్తారా.. లేక ఆయన మంత్రులు ముందుకు వస్తారా అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మీడియా ఏం చేస్తోంది..?
అన్యాయాలను అడ్దుకోవాల్సిన మీడియా కూడా ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కుల సమీకరణాలు, ప్రాంతీయ భావాలతో పాడయిపోయిన మీడియా వ్యక్తులు.., ప్రభుత్వానికి కొమ్ముకాసేలా కధనాలు రాస్తున్నారు. సర్కారును భజనలు చేయటం.., టీడీపీ గొప్పలు ప్రచారం చేయటం తప్ప చాలా తెలుగు మీడియా సంస్థలు మరొకటి చేయటం లేదు. అందువల్ల ఈ అంశం అంతగా ప్రభావం చూపలేకపోతుంది. దీంతో ప్రభుత్వం ఆడిందే ఆట.., పాడిందే పాట అన్నట్లుగా మారిపోయింది. గాంధీ జయంతి రోజున ముసలి వారికి వెయ్యి రూపాయలు అందిస్తామంటున్నారు. కానీ అదే మహాత్ముడి జయంతి లక్షల మంది పేద వృద్ధుల జీవితాల్లో చీకట్లను మిగల్చనుంది.
ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇవ్వాలని ముసలి వారు ఎవ్వరూ రోడ్డెక్కలేదు. అయినా సర్కారు దయతలిచి ఇవ్వటం సంతోషకరం. కాని కొంతమంది అక్రమార్కుల కారణంగా.. రాజకీయ కోణంలో చూసి వాస్తవ లబ్దిదారులను కూడా అనర్హులుగా ప్రకటించటం అన్యాయం. అలా చేస్తే ఎవరూ ఆదరించని వృద్ధులను ప్రభుత్వం కూడా అభాగ్యులుగా వదిలేసినట్లే అవుతుంది. వారం రోజుల్లో ఏపీ సర్కారు మనసు మారి.., ముసలి వారి గురించి ఆలోచించాలని అంతా కోరుకుందాం. హే రామ్...
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more