వరుణుడి ప్రకోపానికి ఏకబిగిన కురిసిన వర్సాలతో వరదలు ఉప్పొంగడంతో కాకావికలమైన కాశ్మీర్ కు అన్ని వర్గాలకు చెందిన ప్రజల నుంచి సహాయం అందుతోంది. కాశ్మీర్ వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా చూసి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాధితులను దేశస్థులే ఆదుకోవాలని.. ఇందుకు మీ చేతనైనంత విరాళం ప్రకటించాలని కోరారు. ఇకనేం ప్రధాని ప్రకటన నేపథ్యంలో యావత్ భారత్ కదలివచ్చింది. బాలివుడ్, క్రికెట్ రంగ ప్రముఖులతో పాటు పలు రంగాలలో ప్రముఖులైన అనేక మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ తరుణంలోనే బాలివుడ్ నటుడు సంజయ్ దత్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా తన సహాయాన్ని ప్రకటించాడు కాబట్టి. దీంట్లో ఏమంత ప్రత్యేకత వుందనేగా మీ డౌట్. ఆయన తన హోదాకు తగ్గట్టుగా సహాయం అందించి వుంటే వార్తే కాదండి.. అంత పెద్ద బాలివుడ్ హీరో.. కేవలం నలభై రూపాయలను మాత్రమే విరాళంగా ప్రకటించడం ఇప్పడు వార్త అయ్యింది. నమ్మకం కలగడం లేదా ఇందుకు రుజువులు కూడా వున్నాయి.
అక్రమంగా ఆయుధాలను కలిగివున్న కేసులో శిక్ష పడి ప్రస్తుతం ముంబయిలోని ఎర్రవాడ జైలులో శిక్షను అనుభవిస్తున్న సంజయ్ దత్.. తన ఒక్క రోజు జీతాన్ని కాశ్మీర్ వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చాడు. సినిమాలు చేసేప్పుడు తన రోజు సంపాదన లెక్కగడటం కష్టమైన పనే. కానీ ఇప్పడు ఎర్రవాడ జైలులో హైక్వాలిటీ పేపర్ బాగ్స్ తయారీలో నిమగ్నమైన సంజయ్ దత్ కు రోజు వారి వేతనం కింద కేవలం నలబై రూపాయలే వస్తుంది. మొన్నటి వరకు అది 25 రూపాయలే వుండగా, తాజాగా ఆయన వేతనాన్ని పెంచారట. అందుకనే తన ఒక్క రోజు జీతాన్ని ఆయన వరద బాధితుల సాయం కింద ఇచ్చారట.
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ వుంది. కేవలం మన హీరో గారొక్కరే కాదండోయ్.. ఎర్రవాడ జైలులోని ఖైదీలందరూ వారి ఒక్క రోజు వేతనాన్ని వరద బాధితుల సాయం కోసం డోనేట్ చేశారు. అయితే విలాసవంతంగా జీవితాన్ని గడిపి.. జైలు శిక్ష అనుభవిస్తూ.. తీవ్ర మనోవేధనకు గురవుతున్న సంజయ్ దత్ కష్టించి సంపాదించిన 40 రూపాయలను డోనేట్ చేయడమంటే తక్కువేం కాదుకదా.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more