ఢిల్లీ జూలో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రపంచం మొత్తానికి తెలసు. ఎన్ క్లోజర్ దాటి ప్రమాదవశాత్తు లోపల పడిపోయిన మక్సూద్ అనే వ్యక్తిని ఓ తెల్ల పులి చంపేసింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం కల్గించింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే.., జూలో ఎన్ క్లోజర్ లోకి వ్యక్తి ఎలా పడిపోయాడు. సెక్యురిటీ వైఫల్యంపై విమర్శలు రావటంతో.., జూ క్యూరేటర్ వివరణ ఇచ్చారు. మంగళవారం మక్సూద్ ను చంపిన పులికి.., మనుషుల్ని చంపే స్వభావం లేదన్నారు. అసలు ఆ పులికి వేటాడటం కూడా తెలియదు అన్నారు. ఆ పులి పేరు విజయ్ అని.., 2007సం.లో లక్ష్మణ్ యమున అనే పులులకు ఇది పుట్టింది అని చెప్పారు. పూర్తిగా జూ వాతావరణంలో పెరిగింది కాబట్టి.., ఆటవిక లక్షణాలేమి తెలయదు అన్నారు.
ప్రస్తుతం ఏడేళ్ళ వయస్సున్న విజయ్ పులి ప్రతిరోజు క్రమంతప్పకుండా ఆహారం తీసుకుంటోందని.., ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. మంగళవారం రోజు కూడా ఎప్పట్లాగానే.., పది కేజీల దున్నపోతు మాంసం ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా శుభ్రంగా స్నానం చేయించామని వివరణ ఇచ్చారు. ఎప్పట్లాగే సాయంత్రం నాలుగున్నరకు ఆహారం తీసుకుందన్నారు. ఇక రెండ్రోజుల క్రితం జరిగిన దుర్ఘటన గురించి మాట్లాడుతూ.. చనిపోయిన యువకుడు ఎన్ క్లోజర్ దగ్గరకు వెళ్ళగా.. సెక్యురిటి సిబ్బంది రెండు సార్లు వద్దని వారించారన్నారు. అయితే సెక్యురిటి మరోవైపు చూస్తున్న సమయంలో దగ్గరగా వెళ్లి.. ప్రమాదవశాత్తు.. లోపల పడిపోయాడని చెప్పారు.
ఎన్ క్లోజర్ లో పడిన వెంటనే మక్సూద్ ను విజయ్ చంపలేదన్నారు. మృతుడు కొత్తవ్యక్తి కావటంతో పాటు.,. కొత్తగా ప్రవర్తించటంతో ఆత్మరక్షణగా భావించి దాడి చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అటు యువకుడిని చంపిన తర్వాత కూడా గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించలేదన్నారు. జూ సిబ్బందితో సాధారణంగానే మెలుగుతోందని చెప్పారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచీ విజయ్ ను అబ్జర్వేషన్ లో పెట్టామని.., ప్రస్తుతం బాగానే ఉందన్నారు. అయినా సరే నెలాఖరు వరకు కదలికలను బాగా పర్యవేక్షిస్తామన్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more