ఏటీఎం మెషిన్లో కార్డు పెడితే ఎవరికైనా డబ్బు వస్తుంది. కాని హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో ఓ వ్యక్తి కార్డు పెట్టబోగా పోలిసులు వచ్చారు. అయతే ఈ రెండు వేర్వేరు సంఘటనలు కాని సంబంధమున్న విషయాలే. పూర్తి వివరాలు చూస్తే., ఎస్సార్ నగర్ లోని ఎస్.బీ.హెచ్. ఏటీఎం సెంటర్ లో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి డబ్బు డ్రా చేసేందుకు వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూసే సరికి ఏటీఎం మెషీన్ అంతా తెరుచుకుని ఉంది. దీంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఇదేమిటి మెషీన్ తెరుచుకుని ఉంది అని దగ్గరగా వెళ్ళి చూస్తే.. అందులో లక్షల రూపాయల డబ్బు ఉంది.
ఆశ్చర్యపోయిన ఖాతాదారుడు వెంటనే., 100కు ఫోన్ చేయగా పోలిసులు ఏటీఎం సెంటర్ దగ్గరకు వచ్చారు. విషయం తెలుసుకుని ఏటీఎం మెషిన్ పరిశీలించారు. డబ్బు ఉండటం చూసి, సంబంధిత బ్యాంకు అధికారులకు ఫోన్ చేయగా.. వారు వచ్చి చూసి షాకయ్యారు. తాళం చేతులు లేకుండా.., ఎవరూ తెరవకుండా ఎలా ఓపెన్ అయిందా అని టెక్నికల్ సిబ్బందిని ఆరా తీయగా.., సాంకేతిక లోపం వల్ల జరుగుతుంది అని వారు చెప్పారు. ఇక మెషీన్ లోని డబ్బును తీసుకుని బ్యాంకు అధికారులు వెళ్లిపోయారు.
సులువుగా డబ్బు సంపాదించేందుకు ఏటీఎం సెంటర్లను చాలామంది టార్గెట్లుగా చేసుకుంటున్నారు. మెషీన్లను పగులగొట్టి.., లేదా ఎత్తుకెళ్ళి మరీ అందులోని డబ్బులు దోచుకుంటుండగా, ఈ ఖాతాదారుడు కళ్ళముందు మెషీన్ లక్షల రూపాయల డబ్బుతో తలుపులు తెరుచుకుని ఉన్నా.. ఒక్క నోటును కూడా ఆశించకుండా బ్యాంకు అధికారులకు అప్పగించాడు. సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యత, ఇతరుల సొమ్ము ఆశించని మంచితనం తెలిసిన స్థానికులు మెచ్చుకుంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more