ఏపీలో ఇప్పుడు రాజకీయ హత్యలపై చర్చ జరుగుతోంది. బడ్జెట్, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ హత్యలపై చర్చలతో అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా రాష్ర్టంలో సంచలనం రేపిన పరిటాల రవి హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లు.., రాజకీయ హత్యలపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ.., ఇదే అంశంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. విమర్శలు ఎదుర్కుంటోంది. వైఎస్ కుటుంబంపై పరిటాల సునీత తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు వైఎస్ కుటుంబమే కారణంగా ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ర్టంలో ఎవరిని అడిగినా చెప్తారన్నారు. హత్య కేసులో నిందితులకు వైఎస్ కుటుంబంతో సంబంధాలున్నాయని చెప్పారు.
పరిటాల రవి హత్య కేసును తిరిగి విచారణ జరిపించాలని కార్యకర్తలు, రవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. హత్యా రాజకీయాలపై చర్చకు డిమాండ్ చేస్తున్న వైసీపీ రవి హత్యపై సమాధానం చెప్పాలన్నారు. ఇక అసెంబ్లీలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై సునీత నిప్పులు చెరిగారు. జగన్ వైఖరి చూసి వైసీపి నేతలే సిగ్గుపడుతున్నారని విమర్శించారు. సభలో జగన్ రౌడీయిజం, దౌర్జన్యం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. అయినా ప్రజా సమస్యలేవి లేనట్లు గ్రామాల్లో కొట్లాటల్లో చనిపోయిన వారి గురించి అసెంబ్లీలో చర్చకు పెట్టడం సరికాదన్నారు. రాజకీయ హత్యలపై చర్చ జరిగితే వైసీపీ గోతులే బయపటడతాయి తప్ప.., తమకేమి ఇబ్బంది లేదన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవి రాయలసీమలో సీనియర్ టిడిపి నేతగా ఎదిగారు. ఆయన తండ్రి బాటలో అనంత జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. అయితే ఫ్యాక్షన్ గొడవల కారణంగా 24 జనవరి 2005న అనంతపురంలోని జిల్లా పార్టీ కార్యాలయం ముందే హత్య చేయబడ్డారు. ఈ హత్య అప్పట్లో రాజకీయ సంచలనం కల్గించింది. ఈ హత్య కేసులో నిందితుడుగా ఉన్న మొద్దు శీను జైల్లో ఓ ఖైదీచే హత్య చేయబడ్డారు. రవి, సూరిని హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కున్న మద్దెల చెరువు సూరిని అతని ప్రధాన అనుచరుడు భానుకిరణ్ హైదరాబాద్ శివారులో హత్య చేశాడు. ప్రస్తుతం భాను జైలులో ఉన్నాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more