వద్దు.., వద్దంటున్నా పట్టుబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తప్పులు తెలుసకుంటోంది. ఆ రోజు విభజన చేయకుంటే బాగుండేది అని ఇప్పుడు బాధపడుతోంది. విభజనతో తమకు ఒరిగిందేమి లేదు. పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఎన్నికల ఫలితాలు చూసుకుని ఆవేదన చెందుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇవ్వటం ద్వారా పార్టికి ఒరిగిందేమీ లేదన్నారు. విభజనతో కాంగ్రెస్ నష్టపోయిందే తప్ప... ఎలాంటి లాభం పొందలేదన్నారు. తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్ ప్రజల్లోకి తీసుకెళ్ళటంతో లోపం జరిగిందన్నారు. అదే విధంగా విభజన నిర్ణయంతో పార్టీపై కోపంగా ఉన్న సీమాంధ్ర ప్రజలను బుజ్జగించటంలో కూడా పార్టీ విఫలమైందని తప్పులు లెక్క చూసుకున్నారు.
అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రక్రియలో కాంగ్రెస్ మాత్రమే దోషిగా నిలబడాల్సి వచ్చిందని దిగ్విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజనపై స్పష్టత ఇవ్వకుండా గందరగోళానికి గురిచేసిన టీడీపిని కూడా రెండు ప్రాంతాల్లో ప్రజలు ఆదరించగా.., కాంగ్రెస్ మాత్రం ఆ మేరకు ఆదరణకు నోచుకోలేదన్నారు. సోనియా వల్లే తెలంగాణ సాధ్యమైందని.., అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్ళలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీమాంధ్రకు కూడా ఉపశమనం కల్గించేలా చేసిన నిర్ణయాలు అక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేదన్నారు.
వైఎస్ బ్రతికుంటే బాగుండేది !!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే కాంగ్రెస్ పరిస్థితి బాగుండేదని దిగ్విజయ్ అన్నారు. వైఎస్ నాయకత్వం మరువలేనిదన్నారు. ఆయన మరణం దురదృష్టకరమనీ.., పార్టీకి తీరని లోటుగా అభిప్రాయపడ్డారు. వైఎస్ వల్లే వరుసగా రెండు సార్లు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో పాటు.., యూపీఏ అధికారంలోకి రాగల్గిందన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more