తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి అడుగులు బలంగానే వేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర మార్కు ను తెచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులకు కొండంత బలంగా సీఎం కేసిఆర్ మారారు. సీఎం ఫేషీ నుంచి ఏ నోటీసు వచ్చిన వెంటనే క్షణాల్లో అధికారులు పూర్తి చేస్తున్నారు. అందుకు నిదర్శనం.. గురుకుల , అయ్యప్పసోసైటీ అక్రమ కట్టడాలను కూల్చిన విధానమే.
అయితే సీఎం కేసిఆర్ మరో సంచలనమైన .. ప్రకటన చేసి, నగరంలో అలజడి రేపారు. ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆంద్రప్రదేశ్ బోర్డులను తీసేయాలని .. అధికారులకు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. దీంతో ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్న ఆంద్రప్రదేశ్ బోర్డులను తొలగింపుకు రంగం సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ పేరు పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రైవేటు సంస్థలు కూడా తమ బోర్డుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణను మార్చుకోవడానికి 30 రోజుల గడువు విధించారు. గడువు దాటిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరు అలాగే కనిపిస్తే... లేబర్ డిపార్ట్ మెంట్ జరిమానా విధిస్తుంది. ఇటీవల సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో... హైదరాబాద్ నగరంలోని బోర్డులపై ఇంకా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
దీంతో నగరంలోని వ్యాపారస్తులు, ప్రభుత్వ అధికారులు.. సైన్ బోర్డు తయారీ చేసే షాపుల ముందు క్యూ కడుతున్నారు. కొంతమంది అయితే పక్క రాష్ట్రంలో ఉన్న సైన్ బోర్డు, ప్లేక్సీల రెడీ చేసే వారి వద్దకు వెళ్లి ఒక రోజు ఉండి మరీ ‘‘తెలంగాణ రాష్ట్రం’’ అని ఉన్న బోర్డులు తయారు చేయించుకొని తెచ్చుకున్నారు. సీఎం కేసిఆర్ పుణ్యంతో.. నగరంలోని పేర్లు రాసే , పెక్సీలు , సైన్ బోర్డ్స్ చేసే వారికి నాలుగు పైసల్ రాబడి దక్కింది. దీంతో వారు చాలా ఆనందంగా 30 రోజులు రాత్రి, పగలు కష్టపడుతూ.. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more