అమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పోటీగా భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడి ఓడిపాయిన స్మృతి ఇరానీకి మంత్రి పదవినిచ్చిన మోదీ ప్రభుత్వం మీద జర్నలిస్ట్ మధు కిష్వర్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. 12 వ తరగతి చదివిన స్మృతి కేంద్ర మానవ వనరుల శాఖకు అర్హురాలు కాదని, నరేంద్ర మోదీ మరో యోగ్యతగలవారిని తన కేబినెట్ లో నియమించాలని ఆమె కోరారు. ఇంకా లోతుగా తరచి చూస్తూ, స్మృతి ఇరానీ తన అఫిడవిట్ లో కరెస్పాండెన్స్ స్కూల్ నుంచి బి.కామ్ పార్ట్ 1 అని తన విద్యార్హతను ప్రకటించారని, నిజానికి అలాంటిదెక్కడా లేదని, అంటే అఫడివిట్ లో ఇచ్చిన సమాచారం తప్పని కూడా కిష్వర్ ఆరోపించారు.
అయితే ఆ ట్విట్టర్ కి సమాధానంగా మరికొందరు ఇలా రాసారు- "రవీంద్రనాథ్ టాగూర్ ఏ యూనివర్సిటీకి వెళ్ళాడమ్మా?", అని ఒకామె అంటే, "కాంగ్రెస్ కి ఈ జాడ్యం పోదు. ఆమె చేతల మీద మాట్లాడండి, ఆమె విధానాలమీద మాట్లాడండి కానీ స్మృతి ఇరానీ డిగ్రీ గురించి చర్చెందుకు, చదువుకున్న కపిల్ సిబాల్ ఏం ఒరగదీసాడని?" అని మరొకరు అన్నారు. "స్మృతి ఇరానీ! ఇవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్ళు. చదువుకి అసలు అర్థమేమిటో తెలియజేయి- అది సంస్కారంతో వస్తుంది" అని మరో ట్వీట్ అంటోంది.
ఒకవేళ చదువులు, డిగ్రీలే ముఖ్యమైతే, నజ్మా హఫ్తుల్లా గుండెకోశ వ్యాధుల నిపుణురాలైన వైద్య శాస్త్రంలో పిహెచ్ డి. ఆమె మైనారిటీ వ్యవహారాల శాఖలో ఏం చేస్తోంది? అరుణ్ జైట్లీ లా చదివారు. ఎల్ఎల్ బి! ఆయన ఆర్థిక శాఖలో ఏం చెయ్యగలరు?
కొందరి అభిప్రాయంలో ఆమె మహిళ కాబట్టి అవకాశమిచ్చారని! అయితే కేవలం ఛార్మ్ కోసం తీసుకునిరావటానికి టివి సీరియల్స్ లలో నటించి మెప్పించిన స్మృతి ఇరానీ అక్కడి నుంచి నేరుగా ఎన్నికలలోకి రాలేదు మిగతా స్టార్లలాగా! ఆమె భాజపా లో పనిచేసి, మహారాష్ట్ర భాజపా యువ శాఖకు ఉపాధ్యక్షురాలిగా ఎదిగారు. భాజపా మహిళా మోర్చ కి నాయకురాలిగా వ్యవహరించారు. అంతేకానీ హేమా మాలిని, మూన్ మూన్ సేన్ లా గ్లామర్ తో వచ్చినావిడ కాదు!
ఆ మాటకొస్తే నరేంద్ర మోదీ రాజకీయ శాస్త్రంలో ఎమ్ ఏ చేసారు కానీ రాకెట్ సైన్స్ గురించి తెలియదే! కానీ ఆయన స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ శాఖను తీసుకున్నారు! రాజ్ నాథ్ సింగ్ భౌతిక శాస్త్రంలో ఎమ్ఎస్ సి డిగ్రీ, హోం శాఖను నిర్వహించటానికి ఎందుకు పనికివస్తుంది? ఆరో తరగతి చదివిన ఉమా భారతి గంగా ప్రక్షాళన ఎలా చేస్తుందని ఎవరూ అడగలేదు!
ఆమె పనితో సంతుష్టి చెందవలసింది ఆమెను నియమించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోది మాత్రమే. "ఎవరీ స్మృతి ఇరానీ?" అని ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వ్యాఖ్యకు, "ఆమె భారత దేశస్తురాలు. అది చాలు!" అని ఉరుముతూ సమాధానమిచ్చారు మోదీ!
మానవవనరుల శాఖలో పనిచేసి మెపించవలసింది స్మృతి ఇరానీ, ఆ పని సరిపోతుందా లేదా అని చూడవలసింది నరేంద్ర మోదీ. అంతే కానీ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అడుగడుగునా ప్రశ్నించటం, వారి పనులను సందేహించటం సరికాదేమో! వారికి తగు సమయాన్నిచ్చి వాళ్ళు చేసిన పనిని పరిశీలించి అప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే బావుంటుందేమో!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more