ప్రింట్ చేసిన పేపర్లలో అతి దారుణంగా పాత పడేది వార్తా పత్రికే. కొన్న పుస్తకాలు, మేగజైన్లను దాచుకుంటారు కానీ సామాన్యంగా వార్తా పత్రికలను ఎవరూ భద్రపరచరు. ఎందుకంటే ఒక రోజు కూడా కాదు- చదవగానే విలువ పడిపోయేది ఒక్క దినపత్రికకే. ఆ రోజు పేపర్ చదవకపోయినా సరే ఎవరైనా తాజా వార్తా పత్రికనే చదువుతారు.
కానీ దానికి భిన్నంగా కోనసీమలో రాజోలు నివాసి, వృత్తి రీత్యా అడ్వకేట్ అయిన పొన్నాడ హనుమంతరావు 50 సంవత్సరాల క్రితం పేపర్ కి చెందిన రెండు కాపీలను భద్రంగా దాచివుంచారు. అందుకు కారణం అందులోని జవహార్ లాల్ నెహ్రూ మరణించారన్న శిఖర వార్త. ఆయన భారత ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రూ వీరాభిమాని, ఆ వార్తా పత్రిక (ద హిందూ) ని నిత్యం చదివే పాఠకుడు.
సరే కానీ ఆయన ఆ ఒక్క వార్త కోసం రెండు కాపీల పేపర్ ని భద్రపరచుకున్నారా?
అందులో దివంగత నేత సంపూర్ణ జీవిత చరిత్ర ఉంది. దాన్ని అప్పుడప్పుడూ తీసి చదువుతుంటానన్నారు హనుమంతరావు. ఆయన నివాసానికి ఆయన పెట్టుకున్న పేరు గాంధీ హౌస్. అది రాజోలు ప్రధాన మార్గంలో ఉంది. ఆయన భద్రపరచుకున్న వార్తా పత్రిక తేదీ మే 28 1964. తానప్పుడు యవ్వనదశలో ఉన్న చిన్న అడ్వకేట్ నని, ఆ పేపర్లోని నెహ్రూ చనిపోయిన దుర్వార్త తనకు షాక్ నిచ్చిందని, ఆయన పోవటంతో ఒక యుగం సమాప్తమైన భావన కలిగిందని హనుమంతరావు అన్నారు.
ఈ పేపర్ తో పాటు ఆయన భద్రపరచుకున్న మరో పేపర్ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ సందర్భంగా వెలివడిన ప్రత్యేక సంచిక! హనుమంత రావు తనకి ఇష్టమైన వార్తాపత్రికలు రెండని చెప్పారు. ఒకటి హిందు, రెండవది అంతరించిపోయిన ఆంధ్ర పత్రిక. ఇప్పటిలా డేటాను భద్రపరచుకునే వెసులుబాటు లేకపోయినా తనకున్న అభిమానంతో ఆసక్తితో 50 సంవత్సరాలు ఒక న్యూస్ పేపర్ హార్డ్ కాపీని జాగ్రత్తగా పదిలపరచుకోవటం విశేషమే.
అయితే, ఆ వార్తా పత్రికలోని జీవిత విశేషాలను చదవటం ద్వారా తన అభిమానాన్ని రెన్యూ చేసుకుంటున్న హనుమంతరావు ఆ విధంగా స్వతంత్ర భారత ప్రథమ ప్రధానికి ఇస్తున్న నివాళులు!
ఇంతవరకు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు వరుసగా భారత ప్రధానిగా దేశాన్ని పాలించింది జవహార్ లాల్ మాత్రమే! స్వాతంత్ర్యం వచ్చిన రోజు- ఆగస్ట్ 15, 1947 నుంచి చనిపోయిన మే 27 1964 వరకు దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పోటీ లేకుండా ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన రికార్డ్ ని ఇంతవరకు అధిగమించినవారు లేరు!
-శ్రీజ
(ఫోటో, కథనం 'ద హిందు' వార్తా పత్రిక సౌజన్యంతో)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more