అవసరమైతే తన సినిమా జీవితాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధమని అన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కెసిఆర్ అవలంబిస్తున్న వైఖరి వలన తెలంగాణా ప్రజలకు నష్టమే జరుగుతుందని పవన్ కళ్యాణ్ షాద్ నగర్ లో తన ఎన్నికల ప్రచార సభలో అన్నారు. అయితే అభిమానులకోసం మరికొంతకాల సినిమాలు చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు వాగ్దానం చేసారు.
జనసేన పార్టీ ఆవిర్భవించిందే ప్రజాశ్రేయస్సులో ప్రశ్నించటానికేనని అన్న పవన్ కళ్యాణ్, భాజపా అభ్యర్థికి మద్దతుగా షాద్ నగర్ లో మాట్లాడుతూ, కేంద్రంలో పెద్దలతో గొడవ పెట్టుకుంటే తెలంగాణాలో అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
అయితే ఈ మాట వినగానే కెసిఆర్, కాంగ్రెస్ లో విలీనానికి కాని పొత్తుకి కాని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచెయ్యటం వలన తెరాస కు నష్టమన్న ఉద్దేశ్యాన్నిపవన్ కళ్యాణ్ వెలిబుచ్చారనిపిస్తోంది కదూ. అలా జరిగితే పప్పులో కాలేసినట్లే.
కొద్ది రోజుల క్రితం మోదీలేదు గీదీలేదు అని అంటూ కాబోయే ప్రధానమంత్రి మీద వ్యాఖ్యలు చేస్తే తెలంగాణా ప్రాంతానికి ఏ విధంగా ప్రయోజనం కలిగించగలరు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణాలో యువకుల బలిదానాలు తన మనసుని గాయపరచాయని, అయితే వారి బలిదానాలు వృధాకాకుండా ఉండాలంటే కెసిఆర్ తన వైఖరిని మార్చుకోవలసి వుంటుందని అన్న పవన్ కళ్యాణ్, ఆ బలిదానాలు చేసిన త్యాగమూర్తుల అభిమతం నెరవేరకుండా ఏ పార్టీ అడ్డుతగిలి వ్యవహరించినా తను ప్రశ్నించటానికి తయారని ఆయన అన్నారు.
తెలంగాణాను, తెలంగాణా ఉద్యమాన్ని తానెంతో గౌరవించానని అన్న పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణా వాదులు దాడి చేసినప్పుడు తాను వాళ్ళని అడ్డుకోలేక కాదని, కేవలం వాళ్ళ మీద గౌరవం వలనే ఏమీ చెయ్యకుండా ఉండిపోయానని ఆయన అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more