మార్చ్ 8 న కౌలాలంపూర్ లో బయలుదేరిన మలేషియన్ పౌర విమాన సంస్థ విమాన సేవ ఎమ్ హెచ్ 370 ఉదయానికి నిర్దేశిత చైనాలోని బీజింగ్ కి చేరలేదు, ఇంతవరకు దాని ఆచూకీ కూడా తెలియలేదు. సముద్రంలో పడిపోయిందని, విమానం దిశ మారిందని, నకిలీ పాస్ పోర్ట్ లతో ఆ విమానంలో ఎక్కినవాళ్ళు ఉగ్రవాద చర్యగా విమానాన్ని అపహరంచి ఉండవచ్చునని రకరకాలుగా ఆలోచిస్తూ, అన్ని కోణాలలోనూ దర్యాప్తులు, గాలింపులు జరుగుతున్నా నిర్దిష్టమైన సమాచారం ఇంతవరకు అందలేదు. అందులో ప్రయాణిస్తున్న 239 మంది ప్రయాణీకులు, విమాన సిబ్బందిలో ఎవరి దగ్గర్నుంచీ ఎటువంటి సమాచారమూ రాలేదు.
అపహరణకు ముందుగా ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ ని ఆఫ్ చేసి ఉంటారని అనుమానం కలుగుతోంది. ఆఖరు సారిగా విమానంలోని సమాచార వ్యవస్థ తెగే ముందుగా రికార్డ్ అయిన మాటలు, ఆల్ రైట్, గుడ్ నైట్ అని. ఆ మాటలు పూర్తై సైన్ ఆఫ్ చెయ్యటానికి ముందే విమాన స్థితిని గురించిన డేటా ను పంపించే మెయిన్ టెనెన్స్ కంప్యూటర్ ని ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుతం మలేషియాలో రవాణా మంత్రిగా పనిచేస్తున్న హిషాముద్దీన్ హుస్సేన్ తెలియజేసారు.
విమానం నడుపుతున్న పైలెట్లు, సిబ్బంది చరిత్రలను తవ్వి చూస్తున్నారు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. కౌలాలంపూర్ శివార్లలో ఉన్న పైలెట్ల నివాసాలను క్షుణ్ణంగా గాలించారు. 53 సంవత్సరాల వయసున్న జహారీ అహ్మద్ షా, 27 సంవత్సరాల ఫారిక్ అబ్దుల్ హమీద్ లు కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రమానికి దగ్గర్లో ఉన్న మధ్యతరగతి కుటుంబ నివాసాలుండే కాలనీలో ఉంటున్నారు. అయితే ఈ విషయంలో అనవసరమైన ఊహాగానాలు వద్దని దర్యాప్తు చేసే వాళ్ళని చెయ్యనీయమని జహారీ తో సన్నిహితంగా ఉండే పైలట్ అన్నారు. జహారీ ఆత్మాహుతికి పాల్పడే వాడు, రాజకీయాలతో సంబంధమున్నవాడు కాదని ఆయన అన్నారు. అంతేకాకుండా అతనితోపాటు కో పైలట్ గా వెళ్ళిన ఫారిక్ అబ్దుల్ హమీద్ ని అధికారులు పంపించారు కానీ, వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చెయ్యటానికి అధికారులను వాళ్ళిద్దరిలో ఎవరూ అడగలేదని కూడా అన్నారు.
దర్యప్తులో సహకరించవలసిందిగా మలేషియన్ ప్రభుత్వం 22 దేశాల దౌత్యాధికారులను అర్థించింది.
ఇంతవరకూ ఆచూకీ తెలియని విమానం విషయంలో ఏ వివరాలు తెలియని ప్రయాణీకులు, సిబ్బందిల కుటుంబ సభ్యులు ఎవరు బాధ్యులు, ఎవరు సరైన సమాధానం చెప్తారంటూ వేదనతో అడుగుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more