ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎత్తుకు పై ఎత్తులు ఎత్తిపొడుపు మాటల్లో ఎవరెంత ప్రేక్షకులను నవ్విస్తే వాళ్ళంత గొప్ప వక్తలు, వారు చేసింది విజయవంతమైన ర్యాలీ అవుతోంది.
ఇన్నాళ్ళూ మోదీ మీద గుజరాత్ 2002 అల్లర్లతో బురద రుద్దుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు తీర్పు, ఇతర మిత్ర పక్షాలు కూడా వారించటంతో దానికి స్వస్తి చెప్పే వేరే దార్లు వెతుక్కుంటోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ మావాడంటే మావాడనే వాదులాట మొదలైంది. ఆకట్టుకునే ప్రసంగాలు కావు పనిచేసే వాళ్ళే ముఖ్యమంటూ ఆమధ్య సోనీయా గాంధీ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ కూడా అందుక దీటుగా సమాధానం చెప్తూ వస్తున్నారు. తాజాగా చెన్నైలో పర్యటించిన మోదీ చిదంబరం వ్యాఖ్యలను తిప్పికొడుతూ తానొక సామాన్యుడిగా పెద్ద పెద్ద విదేశీ చదువులు చదువుకున్నవారితో ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కుంటున్నానని అన్నారు.
ఆర్ధిక శాస్త్రం గురించి మోదీ తెలిసిన దాన్ని చిన్న పోస్టల్ స్టాంప్ మీద రాయొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బిబిసి ఛానెల్ అన్నదానికి మోదీ, స్టాంప్ అతికిస్తేనే ఉత్తరం డెలివరీ అవుతుందని, తాను గుజరాత్ లో అభివృద్ధి ద్వారా తన శక్తి సామర్థ్యాల గురించిన లేఖను డెలివరీ చేసానని అన్నారు.
హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో చదువుకున్న చిదంబరం తమ దగ్గరున్న పెద్ద శక్తిగా మోదీ అందుకు తూగలేరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగుతోంది. దాన్ని తిప్పికొడుతూ, హార్వార్డా, హార్డ్ వర్కా మీరే నిర్ణయించుకోండన్నారు మోదీ చెన్నైలో. పెద్ద పెద్ద డిగ్రీలు చూసి మోసపోకండి. మీకు పనిచేసే నాయకులు కావాలి అని మోదీ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more