క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన పండగ అయిన క్రిస్ మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మన దేశంలో క్రిస్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. క్రిస్ మస్ సందర్భంగా క్రైస్తవులు చర్చిలను ఎంతో అందంగా అలకరించి, అంత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాలు అయిన ముంబై, కోల్కతా, భోపాల్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో అర్ధరాత్రి నుండే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఆసియాలోనే ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో చర్చిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేడుకల్లో భాగంగా సిలువను ఊరేగించి అనంతరం ఆలయంలో ప్రతిష్టించారు. ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. క్రైస్తవ సోదరుల గీతాలపనతో చర్చి మార్మోగింది. జిల్లాను నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. ఈ వేడుకలకు మెదక్ అధ్యక్ష మండలం వైస్ ఛైర్మన్ రైట్ రెవరెండ్ సాల్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు దైవ సందేశాన్ని అందించారు.
హైదరాబాద్ మియాపూర్ కల్వరి చర్చిలో, సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చిలో, మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్య రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. క్రైస్తవులంతా ఆనందోత్సాహాలతో క్రిస్మస్ కేకులు కట్ చేస్తూ శుభాక్షాంక్షలు తెలుపుకున్నారు.
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ను పురస్కరించుకొని అద్భుతాన్ని సృష్టించారు. పూరీలోని సముద్రపు ఒడ్డున ఇసుకతో 75 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పున్న అత్యంత పెద్దదైన క్రీస్తు బొమ్మను తయారు చేశారు. ఈ బొమ్మ.. ఇసుకతో చేసిన అతిపెద్ద క్రీస్తు బొమ్మగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. మూడు రోజులలో, వెయ్యి టన్నుల ఇసుకతో ఈ బొమ్మను తయారు చేసినట్టు సుదర్శన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more