Madhu koda s properties worth rs 144 crore attached

Madhu Koda-s properties worth Rs 144 crore attached, Madhu Koda case, Jharkhand chief minister Madhu Koda, 144 crore properties attached by special court

Madhu Koda-s properties worth Rs 144 crore attached

మాజీ ముఖ్యమంత్రి 144కోట్ల ఆస్తుల జప్తు

Posted: 09/11/2013 08:37 PM IST
Madhu koda s properties worth rs 144 crore attached

అక్రమ ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు చెందిన 144 కోట్ల విలువైన ఆస్తులను ప్రత్యేక మానిలాండరింగ్ కోర్టు జప్తు చేసింది. ఈడీ దర్యాప్తులో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధి కింద ఆస్తులను జప్తు చేయడం జరిగిందని ప్రత్యేక కోర్టు పేర్కొంది. పూణె, ముంబయి ప్రధాన ప్రాంతాల్లోని 25 ప్లాట్లు, జమ్ షెడ్ పూర్ లో ఓ షాపింగ్ మాల్ ను జప్తు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టెరెట్ (ఈడీ) దర్యాప్తులో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధి కింద ఆస్తులను జప్తు చేయడం జరిగిందని ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండోనేషియాలో అరెస్ట్ చేసిన వ్యాపార వేత్త అనిల్ ఆదినాథ్ బస్తవాడే కు సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేశారు. ముంబైలోని మతుంగ ప్రాంతంలోని ఓ ఆపార్ట్ మెంట్ లో కోడా సన్నిహితుడు మనోజ్ బి పునామియా పేరిట ఉన్న పది ఫ్లాట్లను, మలాడ్, గోరేగావ్, నారిమన్ పాయింట్ లోని ఖరీదైన ఫ్లాట్లను జప్తు చేసింది. ఇక జార్ఖండ్ లోని 14.20 కోట్ల విలువైన 'ఎమెరాల్డ్ మాల్' కూడా జప్తు చేసిన వాటిలో ఉంది. నాలుగు వేల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సూచనల మేరకు పోలీసులు మధు కోడాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles