Seemandhra blacks out due to power employees strike

srikakulam,State bifurcation,Samaikyandhra, 48-hour-power-strike

Seemandhra blacks out due to Power employees strike for Samaikhyandhra

కరెంట్ బంద్ చేశారు..

Posted: 09/12/2013 09:54 AM IST
Seemandhra blacks out due to power employees strike

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గత 42 రోజులుగా సీమాంధ్రలో ఏపీఎన్జీఓలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సమ్మెబాటలోకి విద్యుత్ ఉద్యోగులు వచ్చి చేరారు. సీమాంధ్ర ప్రాంతంలోని 13 .జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో నేటి ఉదయం నుండి సీమాంధ్ర (కళ్ళున్న కబోది లాగ) చీకటిగా మారింది. ఈ సమ్మెలో ఈపీడీసీఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో 48 గంటల సమ్మె చేపడుతున్నారు. తొలుత బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినా ట్రాన్స్‌కో రాష్ట్ర జేఏసీ నేతలు ముఖ్యమంత్రితో సమావేశం అయిన తరువాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో 72 గంటల సమ్మె చేయాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం నిర్ణయింది. ఈ సమ్మె నోటీసు గత 20 రోజుల కిందటే ఇచ్చినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో సీమాంధ్రలో కారు చీకట్లు కమ్ముకునే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీఎన్జీఓలు ఈనెల 16 తరువాత నుండి ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles