Kiran kumar reddy called aps ngos strike resign

kiran kumar reddy called aps ngos strike resign, Chief Minister N Kiran Kumar Reddy, seemandhra movement, Telangana movement, called aps ngos strike resign, president P Ashok Babu, Samaikyandhra Movement

kiran kumar reddy called aps ngos strike resign

సీఎం పిలుపు-సమ్మె విరమించండి

Posted: 09/11/2013 05:54 PM IST
Kiran kumar reddy called aps ngos strike resign

 

43 రోజుల నుండి సీమాంద్రలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మొదటి సారి సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమం గురించి మాట్లాడారు. మొత్తం మీద విభజన ప్రకటన అనంతరం ఉద్యమం ఆరంభమైన తర్వాత మొట్టమొదటి సారి ఇలాంటి ప్రకటన ఒకటి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కన్నా సమైక్య వాడిగా రాష్ట్రం కలిసి ఉండేలా చూడాలన్న వ్యక్తిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా అసలైన ముఖ్యమంత్రిగా మారిపోయారు. ఇప్పటి వరకు ఉద్యమాన్ని ఆపడానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏమీచేయలేదని పేరుతో పాటు గట్టి సమైక్య వాడిగా ముద్రపడ్డారు. ఈ రోజు ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన సమ్మె విరమించాలని ఏపీఎన్జీవోలకు పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల రవాణా, విద్యా, ఆరోగ్య, విద్యుత్ సర్వీసులకు అంతరాయం కలగకుండా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దని ఏపీఎన్జీవోలను, సమ్మె చేస్తున్నవారిని ముఖ్యమంత్రి కోరారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles