ఈరోజు శాసన సభకు హజరవటానికి పాదయాత్రతో రావటానికి తెలంగాణా రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇది నిరసన పాదయాత్ర. నిన్న తెలంగాణా వాదులు నిర్వహించిన సడక్ బంద్ కార్యక్రమంలో అనవసరంగా నాయకులను అరెస్ట్ చేసారంటూ నిరసిస్తూ తమ నిరసనను ఈ విధంగా ప్రకటించటానికి తెరాస నిర్ణయించుకుంది.
ఉద్యమ అణచివేతకు కిరణ్ కుమార్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, అది ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేవిధంగా ఉందని, ఈ విషయం మీద ఈ రోజు ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తామని తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు.
నిన్న సడక్ బంద్ లో నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ తెలంగాణా ప్రాంతమంతా నిరసనలు చేపట్టాలని తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more