పాకిస్తాన్ ప్రభుత్వం నేషనల్ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం పట్ల భారత దేశంలో ప్రతిపక్షాలు చేసిన ఆందోళనకు స్పందించిన భారత ప్రభుత్వం నిన్న పార్లమెంటులో పాస్ చేసిన రిజల్యూషన్ ఇలా ఉంది-
మార్చి 14 న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాస్ చేసిన రిజల్యూషన్ ని పూర్తిగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ ప్రభుత్వం తమ భూభాగంలో భారత్ మీద ఉగ్రవాద దాడుల తయారీలకు ఆస్కారమివ్వదన్న హామీయే పాకిస్తాన్ తో శాంతియుతమైన సంబంధాలకు హేతువవుతుంది.
భారత దేశానికి సంబంధించిన అంతర్జాతీయ వివాదాలలో పాకిస్తాన్ తలదూర్చటాన్ని, ఉగ్రవాదానికి చేయూత నివ్వటాన్ని భారత్ సహించదు.
జమ్మ కాశ్మీర్, అందులో చట్టవ్యతిరేకంగా ఆక్రమించుకున్న భూభాగంతో సహా అంతా భారత దేశానికి చెందినదే, భారత దేశంలోని అంతర్భాగమే. అటువంటి భారత ఆంతరంగిక వ్యవహారాలలో కలుగజేసుకుంటే అందుకు దీటుగా అఖండ భారతదేశం ఐకమత్యంతో తీసుకునే ప్రతిచర్యలుంటాయి.
ప్రతిపక్షాలు ఆందోళన చెయ్యటమూ సబబే, దేశవాసులందరికీ బాధ కలిగించటమూ సరైనదే, ప్రభుత్వం పార్లమెంటులో తీసుకున్న నిర్ణయం శ్లాఘనీయమే. కానీ ఇలాంటి రిజొల్యూషన్ వలన ఏమౌతుంది అని అడిగేవారూ ఉన్నారు. అంతకు ముందుకూడా ఇలాంటి రజోల్యూషన్ లు పాస్ చేసారు ఏమిటి దాని ఫలితం అని ప్రశ్నించేవారూ ఉన్నారు. పోయిన నెలలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమర్థించటం మానెయ్యాలి, భారత్ కి వ్యతిరేకంగా అక్కడ ఉగ్రవాద శిక్షణలకు స్వస్తి చెప్పాలంటూ కోరింది. కానీ పరిస్థితుల్లో తేడా ఏమీ రాలేదు కదా అంటారు.
కానీ ఇది కనీస ధర్మం. భారత దేశ వాసుల హృదయ నాడిని పార్లమెంటులో స్పందింపజేసారు. బాధ కలిగినప్పుడు పరామర్శిస్తే ఏమవుంది అని అంటే ఏం చెప్తారు. నేనున్నాను, మీ బాధలో పాలుపంచుకుంటున్నాను అని చెప్పటమనేది మానవత్వం. అలాగే, బాధ కలిగించిన వారి చర్యలను ఖండిస్తున్నామనటం కూడా అవసరమే. పద్ధతి మార్చుకోకపోతే పాకిస్తాన్ తో సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామని అనటం కన్నా ప్రస్తుతం చేసేది ఏముంటుంది. సినిమా కాదు కదా వెనువెంటనే యుద్ధానికి కాలు దువ్వటానికి. జాతీయ అంతర్జాతీయ కట్టుబాట్లను ఎన్నిటినో పాటించవలసి వుంటుంది.
శత్రు దేశాలను దీటుగా ఎదుర్కోవాలంటే కావలిసింది ఐకమత్యం కానీ ఒకరినొకరు విమర్శించుకుంటూ కాలాన్ని వెళ్ళదీయటం కాదు. దేశంలో అంతర్గత కలహాలు, బలహీనతలే శత్రు దేశాలకు బలం చేకూరుస్తుందని తెలుసుకోవాలి. రిజొల్యూషన్ వలన ఏమౌతుంది అని అంటే, పాకిస్తాన్ చేసింది కూడా రిజొల్యూషన్ కదా!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more