3 ఇడియట్స్ అనే సినిమాలో, మరొకరు రాసిచ్చిన ప్రసంగాన్ని అనాలోచితంగా చదివి కడుపుబ్బ నవ్వించిన సన్నివేశం నిన్న రాజ్య సభలో జరిగిన సంఘటనతో గుర్తుకొస్తుంది.
నిన్న రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రసంగంలో ఆయన అత్యాచార కేసుల గురించి చెప్తూ, అనాలోచితంగా అక్కడ రాసున్నది రాసున్నట్టుగా చదవటం లో నిమగ్నమై, అత్యాచారానికి గురైన బాలికలు, మహిళల పేర్లు కూడా చదివేసారు. ఒక కేసులో పేర్లు బయట పెడుతుంటే వారించబోయిన అరుణ్ జైట్లీ మాటలను అర్థం చేసుకోక మిగిలిన కేసుల్లో బాధితుల పేర్లు కూడా బయటపెట్టేసారు. తనకు రాసిచ్చిన దానిలోని అక్షరాలను కూడబలుక్కుని ఉన్నదున్నట్టుగా చదవటంలో పూర్తిగా మునిగిపోయిన హోం మంత్రికి, అందులో చదవగూడనివి, ప్రకటించగూడనివి ఆయన దృష్టి నుంచి తప్పించుకున్నాయి. అత్యాచారాల సంఘటనలలో బాధితుల పేర్లను పైకి చెప్పగూడదన్న సంగతి సర్వ సామాన్యంగా అందరికీ తెలిసిందే కానీ హోం మంత్రి ఈ నియమాన్ని ఉల్లంఘించారు.
రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజి కురియన్ విడమరచి చెప్పేంత వరకూ తన తప్పుని తాను తెలుసుకోలేకపోయిన షిండే, అర్థమైన తర్వాత ముందుగా అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ, తను చదువుతున్న ఆ ప్రకటనలో ఆ పేర్లను, చేర్చిందెవరో నాకు తెలియాలి అంటూ హోంశాఖను విచారణ చెయ్యమని ఆదేశించారు.
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా అనాలోచితంగా ఏదో మాట్లాడెయ్యటం, తిరిగి దాన్ని సవరించుకునే ప్రయత్నంలో నాలిక కొరుక్కోవటం అలవాటు చేసుకున్నట్టున్నారు. లోగడ కూడా ఎన్నో సందర్భాల్లో అనాలోచితంగా మాట్లాడి, ఆ తర్వాత ఆ తప్పు దిద్దుకునే దిశగా ఆయన క్షమాపణలు చెప్పుకోవటమో మరేదో చేసారు.
రాజకీయాల్లో ఉన్న వాడి, వేడి, ఎత్తుకు పై ఎత్తులతో ఒత్తిడికి లోనైన మస్తిష్కాలకు ఇలాంటి సంఘటనలు వినోదాన్ని కలిగించి వారికి కొంత సేద తీరుస్తాయేమో.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more