నిన్న సాయంత్రం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం మీద సుప్రీం కోర్టు తీర్పు గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అంతా మన మంచికే అన్న ధోరణిలో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు వలన రాష్ట్రానికి మేలే జరుగుతుందని ఆయన అన్నారు. 60 టిఎమ్ సిలకు మించి గోదావరి జలాలను మహారాష్ట్ర వాడుకోరాదని, వర్షాకాలమంతా గేట్లను బార్లా తెరచే వుంచాలని ఇచ్చిన తీర్పు వలన మనకు నష్టం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తూ, అఖిల పక్షం ఒకవేళ నష్టం జరుగుతుందని భావించనట్లయితే దాన్నిబట్టి సుప్రీం కోర్టుకి మరో సారి పోతాం అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఒప్పందంలో ఉన్నదాన్ని బట్టే సుప్రీం కోర్టు తీర్పు లభించింది, అది అంతకుముందున్న స్థితే కూడా. అలాంటప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వెయ్యవలసి వచ్చిందో ఆయన తెలియజేయలేదు.
ప్రతి పక్షాలు ప్రతిదానికీ విమర్శిస్తారని, ఇంధనం విద్యుత్ ఛార్జీలతో రాష్ట్ర ప్రభుత్వానికేమీ సంబంధం లేదని, అయినా, ఛార్జీలు పెంచకుండా ఉండటానికి ఏ ఖర్చులను తగ్గించుకోవాలో ప్రతిపక్షాలే చెప్పాలన్నారు ముఖ్యమంత్రి. వచ్చే ఏడాది వరకు వ్యవసాయ ఋణాలు 70 వేల కోట్లకు, మహిళా ఋణాలు 36 వేల కోట్లకు చేరుకుంటాయి. రైతుల ఋణాలను రద్దు చెయ్యాలంటే 2 లక్షల కోట్లు కావాలి. అంత సొమ్మును చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు, ఈ విషయాన్ని ప్రజలు ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారాయన.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more