సెల్ సిగ్నల్స్ ఆధారంగా డాక్టర్ ఆచూకీని కనుకొన్న పోలీసులు కిడ్నాపర్ల బారి నుంచి హర్షారెడ్డిని కాపాడారు. హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్ మిస్టరీ వీడింది. కృష్ణాజిల్లా నూజివీడులో హర్షారెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హర్షారెడ్డిని కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్షారెడ్డితో పాటు వారిని కూడా హైదరాబాద్ తరలించారు. కిడ్నాప్ వ్యవహారానికి ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులన్నారు. బంధువులే ఈ మొత్తం డ్రామాకు కారణమని తేల్చారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు హర్షారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డికి ఇద్దరు భార్యలు. అయితే మొదటి భార్య కుమారులకు లక్ష్మారెడ్డి 17ఎకరాల స్థలాన్ని రాసిచ్చాడు. అదే విధంగా మిగిలిన నాలుగు ఎకరాలను రెండవ భార్య కుమారుడు హర్షారెడ్డికి ఇచ్చాడు. ఇదే వ్యవహారంపైనే మొదటి భార్య కుమారులు తండ్రితో తరచూ గొడవలకు దిగేవారని తెలిసింది. ఆ నాలుగు ఎకరాలు కూడా తమకే రాసివ్వాలని డిమాండ్ చేసే వారని సమాచారం.
ఈ సందర్భంలోనే హర్షారెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయంత్రం 6.20కి కిడ్నాపైన హర్షారెడ్డి వ్యవహారాన్ని పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే ఆ తర్వత కిడ్నాపర్లు హర్షారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి 40లక్షలు డబ్బుల డిమాండ్ చేశారు. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. ఎలాగైనా కిడ్నాప్ మిస్టరీని ఛేదించాలని రంగంలోకి దిగిన పోలీసులు మూడు టీంలుగా ఏర్పడ్డారు.హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడలో ఒక్కో టీం విడిపోయి గాలింపు చర్యలు చేపట్టింది. అనుమానం వచ్చిన వారందరినీ పోలీసులు ప్రశ్నించారు. ఆస్పత్రిలోని సహచర ఉద్యోగినితో హర్షారెడ్డికి ప్రేమ వ్యవహారం ఉందని దీంతో ఆమె తరపు బంధువులే కిడ్నాప్ చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపించాయి.మరోవైపు నల్గగొండ జిల్లాలో హర్షారెడ్డి ఫోన్ లభించింది. అయితే అందులో సిమ్ లేకపోవడంతో పోలీసులు హర్షారెడ్డి కాల్ డేటాపై దృష్టి సారించారు. కేవలం ఫోన్ సిగ్నల్స్ ఆధారంగానే హర్షారెడ్డి కృష్ణా జిల్లా నూజివీడులో ఉన్నట్లు కనుక్కొని మిస్టరీని ఛేదించగలిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more