కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు రాజ్యసభలో తన ఆఖరి స్పీచ్ ని అదరగొట్టాడు. ఆఖరి స్పీచ్ అని ఎందుకు వాడవలసి వచ్చిందంటే.... ప్రస్తుత రాజ్యసభ్య ఎన్నికలకు కే. కేశవరావు టిక్కెట్ రాలేదు. కాబట్టి అతను మళ్ళీ రాజ్యసభలో అడుగు పెట్టలేడు. తనకు పదవి రాలేదని కోసంతోనో లేక తెలంగాణ రాష్ట్రం కోసం నేను సైతం పోరాడుతున్నానని చెప్పడానికో కానీ మొత్తానికి స్పీచ్ ఇరగదీశాడు. "అసలేం జరుగుతోంది? తెలంగాణ ఆకాంక్ష కోసం మరింత మంది చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా? వెయ్యి మంది చనిపోవాలా? మూడు కోట్ల మంది చనిపోవాలా? ఉద్యమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను. నేను సిద్ధం, ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. చనిపొమ్మంటే చనిపోతాం. మేమంతా అడుగుతోంది ఒక్కటే.. మీరు ఏం చెప్పారో అది చేయండి చాలు'' అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు అన్నారు.
ఒక ప్రాంతంలోని అసెంబ్లీ సభ్యులు, మంత్రులు, ఎంపీలంతా రాజీనామా చేసిన సంఘటనలు దేశంలో ఏమైనా ఉన్నాయా? ప్రజాస్వామ్య గళాన్ని వినిపించుకోకుంటే పార్లమెంటు అనే పదానికి అర్థం ఉందా? ప్రజాస్వామ్యం వల్ల లాభం ఏముంది?'' అని ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వగలరని కేకే ఆశాభావం వ్యక్తం చేశారు. "తెలంగాణపై నెహ్రూ, లాల్బహుదూర్ శాస్త్రి, రాజీవ్ మాట్లాడలేకపోయారు. నరసింహారావూ తేల్చలేకపోయారు. సోనియాగాంధీయే హామీ ఇచ్చారు. సోనియా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. ఆమె నాయకత్వంలోనే కొత్త రాష్ట్రం ఏర్పాటువుతుంది'' అని కేకే విశ్వాసం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకూ 609 ఆత్మహత్యలు జరిగాయని, ఇంకా ఎంతకాలం ఇవి జరగాలని ఆయన ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more