ఒక ఊహా లోకంలో జరిగే విముక్తి పోరాటాన్ని ‘అవతార్’ గా తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం నమోదు చేసిన ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ నిజ జీవితంలో కూడా ఓ సంచలనం నమోదు చేశాడు. 57 ఏళ్ళ జేమ్స్ కామెరూన్ సముద్ర అగాధాల్లో రహస్యాల ఛేదనకు దిగాడు. గత 52 ఏళ్ళలో ఎవరూ చేయని ఈ సాహసంలో భాగంగా భూమిపై అత్యంత లోతైన ప్రదేశమైన పసిఫిక్ మహా సముద్రంలోని మెరియానా ట్రెంచ్ అగాధంలోకి ఒంటరిగా జలాంతర్గామిలో వెళ్ళి తిరిగి వచ్చాడు. ఈ అగాధాన్ని అన్వేషించిన మూడో వ్యక్తిగా జేమ్స్ రికార్డు సృష్టించాడు. అయితే మెరియానా ట్రెంచ్ లోతులకు ఒంటరిగా ప్రయాణించిన తొలివ్యక్తి జేమ్స్ అని నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ ప్రకటించింది. 1960 జనవరి 23న స్విట్జర్లాండ్కు చెందిన జాక్వెస్ పికార్డ్, అమెరికన్ డాన్ వాల్ష్లు కలిసి ఈ అగాధంలోకి వెళ్ళివచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ఎవరూ ఆ సాహసానికి పూనుకోలేదు. అయితే రోబోట్లు మాత్రం ఈ లోతుల్లో ఆన్వేషణలు సాగించాయి.
ఈ సముద్ర అగాధ యాత్రలో భాగంగా జేమ్స్ సోమవారం, ఉదయం సరిగ్గా 7గంటల 52 నిమిషాలకు 10898 మీటర్ల (11 కిలోమీటర్లు)లోతైన మెరియానా ట్రెంచ్ అగాధంలోకి చేరుకున్నారు. ఈ అగాధ యాత్ర పూర్తి చేయటానికి జేమ్స్ కు రెండున్నర గంటల 36 నిమిషాలు పట్టింది. యాత్రా పూర్తయిన తర్వాత జేమ్స్ మాట్లాడుతూ సముద్రంలోని భూతలంపై ఏమీ లేదని ‘అదో ప్రత్యేక ప్రపంచం. నేను అంతరిక్షంలో ఉన్న భ్రాంతిని పొందాను. వేరే గ్రహంపైకి వెళ్ళి మళ్ళీ భూగ్రహం పైకి వచ్చిన విధంగా ఉందని జేమ్స్ తన అనుభవాన్ని తెలిపారు. సముద్రంలోతుల్లోకి వెళ్ళటం పట్ల జేమ్స్ కు చిన్నప్పటి నుంచే అసక్తిని కలిగివున్నారు. ఇప్పటివరకు 72 సార్లు సముద్ర లోతుల్లోకి ప్రయాణించారు. 1997లో జేమ్స్ తీసిన టైటానిక్ సినిమా సందర్భంగా దాని అవశేషాలను చిత్రీకరించటానికి ఆ నౌక మునిగిన ఉత్తర అట్లాంటిక్ సముద్రం లోతుల్లోకి 33 సార్లు వెళ్ళారు. ప్రస్తుతం ఆ సినిమా 3డీ వెర్షన్లో వచ్చే నెలలో విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more