మన మూడు రంగుల జాతీయ పతాకం చూడగానే మనకు ఎక్కడిలేని ఉత్తేజం వస్తుంది. మరి జాతీయ పతాకంలో ఉండే ఆమూడు రంగులు రూపొందించింది ఎవరయ్యా అంటే మనకు గుర్తుకు వచ్చేది పింగళి వెంకయ్య. ఈయన మన జాతీయ పతాక రూపశిల్పి. మరి అలాంటి మహ నీయుని రక్తసంబంధీకు లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఒక గుడి వద్ద యాచన చేస్తూ అత్యంత దయనీయం గా బతుకు ఈడ్చుకు వస్తున్నారు. పింగళి వెంక య్య స్వయాన సోదరుడి కుమార్తె ఎనిమిది పదుల వయసున్న ఘంటశాల జయలక్ష్మి ఇప్పుడు ఎవరికీ పట్టనివారే అయ్యారు.
ఆగష్ణు 15, జనవరి 26 రాగానే మన నాయకులు జెండాను ఎగుర వేస్తారు. దానికి ఓ పది రోజుల నుండే హడావుడి చేస్తారు. మరి ఆ జెండా రూపశిల్పికి సంబంధించిన రక్త సంబంధీకులు ఉన్నారా ? ఉంటే వారికి ఏమైనా ప్రభుత్వం తరుపున అందుతున్నాయా ? ఆలోచించరు. అలాంటి నాయకుల రాజకీయం కింద నలిగిపోతున్నారు పింగలి వెంకయ్య రక్త సంబంధీకలు.
ఏలూరు లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద మిగతా యాచకులతో పాటు కొన్నేళ్లుగా జయలక్ష్మి కుటుంబం యాచన చేస్తూ బతుకుతున్నారు. ఇద్దరు కొడుకులతో రోడ్డుపక్కనే జీవిస్తున్నారు. అయితే జయలక్ష్మి వయసు మీదపడడం, ఆమె ఇద్దరు కుమారు లు తమ కుటుంబ నేప«థ్యాన్ని నేరుగా వివరించే స్థితిలో లేకపోవడంతో, వీరిని పింగళి రక్తసంబంధీకులుగా ఎవరూ గుర్తించలేదు. స్థానికులు వీరిని యాచకులగానే చూస్తూ వస్తున్నారు. జయలక్ష్మి భర్త భాస్కరరావు కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన వారు.ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. వృత్తిలో ఉండగానే సుమారు 30 ఏళ్ల కిందటే కన్నుమూశారు. అచ్చటి నుంచి జయలక్ష్మి ఏలూరుకు చేరుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఆమె రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వరస్వామి గుడిని ఆసరాగా ఎంచుకున్నారు. అక్కడే ఓ మూలన ఒదిగి కాలం గడుపుతున్నారు. గుడికి వచ్చే భక్తులు తోచి న సాయం చేస్తే సరేసరి. లేదంటే అంతే సంగతి. అయినా ఏనాడూ కూడా తాను పింగ ళి రక్తసంబంధీకులమని నోరెత్తి చెప్పలేదు. వయోభారంతో, కదలలేని స్థితిలో ఉన్న ఆమె తనకు పింగళి వెంకయ్య పెదనాన్న అవుతారని మాత్రం సమాధానం చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more