ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి అవిశ్వాస పరీక్షలో ప్రభు త్వానికి అండగా నిలిచిన చిరంజీవికి పెద్దపీట వేయా లని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్య మంత్రి కిరణ్కుమార్రెడ్డిని ఆదేశించారు. ఢిల్లీలో సిఎంతోపాటు కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను సోనియాగాంధీకి నివేదించారు. సోనియా ఇంట జరిగిన ఈ భేటీలో చిరంజీవికి సంబంధించి ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మా నం పెట్టినపుడు చిరంజీవి పార్టీని అన్ని విధాలుగా ఆదుకున్నందున ఇక ఆయనతో పాటు ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ వారిగానే గుర్తించి గౌరవించాలని సోనియా సూచించారు.
చిరంజీవితో పాటు ఆ వర్గం ఎమ్మెల్యేల్లో నెలకున్న అసంతృప్తిని గమనించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ఎప్పటికప్పుడు వారిని బుజ్జగిస్తూ వచ్చారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్లో ప్రభుత్వానికి చిరుతోపాటు ఆయన వర్గానికి చెందిన 17మంది ఎమ్యెల్యేలు మద్దతు ఇవ్వటంతో పార్టీ అధిష్టానం వద్ద మంచి మార్కులు పడ్డాయి. అధిష్టానంకూడా ఇక చిరంజీవికి ఏదో ఒకటి చేయాలన్న బలమైన అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే సోనియా వద్ద చిరంజీవి అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. చిరంజీవికి ఇకపార్టీలో పెద్ద పీట వేయటంతోపాటు విధాన పరమైన నిర్ణయాల్లోనూ అయన్ను కలుపుకుని వెళ్ళాలని సూచించినట్టు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సోనియా నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న ప్రాధాన్యం గౌరవం వారికి కూడా ఇవ్వాలని ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నామినేటెడ్ పదవుల్లో కూడా ఆ నేతలకు తగిన భాగస్వామ్యం ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఆజాద్తోపాటు పీసీసీ అధ్యక్షుడితో చర్చించి చిరంజీవి వెంట వచ్చిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని సోనియా ముఖ్యమంత్రి కిరణ్కు సూచించినట్టు సమాచారం. సమయం వచ్చినపుడు చిరంజీవికి కూడా ఆయన గౌరవానికి తగ్గ హోదా కల్పిస్తామని సోనియా చెప్పినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీ పర్యటన తమకు అన్నివిధాలుగా అనుకూలించిందని, సోనియా గాంధి జోక్యంతో ఇక తమకు పార్టీలోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోను ప్రాధన్యం లభిస్తుందని చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలు కూడా బలంగా విశ్వసిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more