పూర్తి పేరు : పాలువాయి భానుమతీ రామకృష్ణ
జననం : 07-09-1925
జన్మస్థలం : ప్రకాశం జిల్లా, ఒంగోలు తాలూకా, దొడ్డవరం గ్రామం
తల్లిదండ్రులు : సరస్వతమ్మ, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య
వివాహం - భర్త : 08-08-1943 - రామకృష్ణారావు
సంతానం : కుమారుడు (భరణి)
నటిగా తొలిచిత్రం : వరవిక్రయం (1939)
ఆఖరిచిత్రం : పెళ్లికానుక (1998)
చిత్రాలు : దాదాపు 100 (తెలుగు, తమిళం, హిందీ, కన్నడం)
గాయకురాలిగా తొలిచిత్రం - పాట : వరవిక్రయం - పలుకవేమి నా దైవమా, ఆఖరిచిత్రం - పాట : పెళ్లికానుక - ‘బంగారుబొమ్మకు’ పాట బాలుతో
పాటలు : సుమారు 250 పైగా సంగీత దర్శకురాలిగా తొలిచిత్రం : చక్రపాణి
(1954), ఆఖరిచిత్రం : అసాధ్యురాలు (1993)
చిత్రాలు : 11
దర్శకత్వం వహించిన సినిమాలు : 6 (కొన్ని మధ్యలో ఆపేశారు)
భానుమతి తల్లిదండ్రులిద్దరూ సంగీతంలో ప్రవేశమున్నవారే. సంగీతంలో తన తొలిగురువు తండ్రి కావడం విశేషం. ఆమెకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అంటే ఎంతో అభిమానం. ఒకసారి త్యాగ రాజ ఆరాధనోత్సవాల సమయంలో తిరువాయూరు లో సుబ్బులక్ష్మితో కలిసి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన పాడే అవకాశం లభించింది. ఆ గాత్రమాధుర్యం సినీరంగంలోని ప్రముఖల దృష్టిని ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి గాయకునిగా, నటిగా, సంగీత దర్శకులురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా సినిమా రంగంలో తన ప్రతిభను అన్నివిధాలా చాటుకున్నారు.
చలనచిత్ర పరిశ్రమలోనూ, సాహితీరంగంలోనూ విశిష్ఠమైన వ్యక్తి భానుమతీరామకృష్ణ. అందువల్లనే ఆల్రౌండర్ కాగలిగారు. తొలుత తన 13వ ఏటనే తండ్రి నుంచి సంగీతాన్ని అభ్యసించారు. సినీరంగంలోకి అడుగిడినా చాలకాలం తండ్రికూచిగానే వ్యవహరించారు. 14వ ఏట 'వరవిక్రయం' చిత్రంలో నటిగా చిత్రరంగ ప్రవేశం చేసారు. అసిస్టెంట్ డైరక్టర్ రామకృష్ణని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పరుల సహకారంతో పెళ్ళి అయ్యాక సాధారణంగా గృహ జీవితంలో తృప్తిపడతారు మహిళలు. భానుమతి అలాకాకుండా నటనను కొనసాగించారు కొంత గ్యాప్ యిచ్చి. భరణి సంస్థను నెలకొల్పి 'రత్నమాల' చిత్రాన్ని తొలిసారిగా నిర్మించి 1947లో విడుదల చేసారు. భరణి స్టూడియోస్ని నెలకొల్పారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. పాటలు పాడారు. అంతేకాదు సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, చిత్రకారిణిగా, జ్యోతిష్కురాలిగా ప్రజ్ఞా పాటవాలు చూపారు. ఇక రచయిత్రిగా అత్తగారి కథలు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని పొందింది. 'నాలో నేను' అనే స్వీయ చరిత్ర ఉత్తమ జీవితచరిత్రగా కేంద్రప్రభుత్వం నుంచి అవార్డుని తెచ్చింది. మద్రాసు సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసారు.
గౌరవపురస్కారాలు : ఉత్తమనటిగా 1956లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డు, తమిళ ప్రభుత్వం నుండి 1956లో ‘నడిప్పుక్క ఇలక్కణం’, 1960లో ‘కలైమామణి’ బిరుదులతో సత్కరించారు. తాను రాసిన ‘అత్తగారి కథలు’ కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1966లో పద్మశ్రీ, 1975లో ఆంధ్రయూనివర్సిటీ నుండి ‘కళాప్రపూర్ణ’, 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1998లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, 2004లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, మరెన్నో అవార్డులు అందుకున్నారు.
మరణం : 24-12-2005
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more