చింతపల్లి మండలానికి చెందిన 25 మంది మిలీషియా సభ్యులు ఎస్పీ జి.శ్రీనివాస్ సమక్షంలో లొంగిపోయారు. జిల్లా పోలీసులు నిర్వహించిన సద్భావన యాత్ర కార్యక్రమంలో పోలీసుల ఇచ్చిన హామీలు వారిని ప్రభావితం చేసి జనస్రవంతిలో కలిసేలా చేశాయి. నగరంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఐజీ స్వాతిలక్రా వివరాలు వెల్లడించారు. కోరుకొండకు చెందిన శాండి కమిటీ దళ సభ్యడు రీమాల లక్ష్మణరావు(40), బలరేవుల గ్రామాని చెందిన మిలీషియా డిప్యూటీ కమాండర్ వంతల చంటి(25), చింతపల్లి మండలం బలపాం గ్రామానికి చెందిన మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. మూడేళ్లుగా మిలిషియా సభ్యులుగా పని చేస్తున్న వీరు వారు గతంలో చింతపల్లి మండలం, వంగసార కాఫీబోర్డు పేల్చివేత, ఘాట్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను హతమార్చడానికి ప్రయత్నించారని డీఐజీ చెప్పారు. చెట్లను నరికి దారికి అడ్డంగా వేయడం, పాడేరు ఆర్డీవో విధులను ఆటంక పర్చడం వంటి నేరాలకు పాల్పడ్డారని ఆమె తెలియపారు. లొంగిపోయిన వారికి రూ.5 వేలు సహాయం అందిస్తున్నామని ఆమె ప్రకటించారు. ఎస్పీ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల కోరుకొండలో నిర్వహించిన సద్భావనయాత్రలో మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. పోలీసులు పెడుతున్న కేసులకు భయపడి లొంగిపోయామని మిలీషియా సభ్యులు తెలిపారు. కాఫీ తోటలు ఇతర కేసుల్లో ఉన్నందున తమ కుటుంబాలతో జీవించలేకపోయే వాళ్లమని చెప్పారు. పోలీసుల పహార వల్ల పిల్లలకు అనారోగ్యం చేసిన సైరెన వైద్యం అందించలేక పోయేవాళ్లమని ఆవేదన చెందారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more