సమైక్యాంధ్రకు మద్దతుగా దేవినేని అవినాష్ అధ్వర్యంలో బందరురోడ్డులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈరోజు ఉదయం లక్షగళ గర్జనకు దిగారు. లక్ష మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు వినిపించారు. మూడు గంటల పాటు విద్యార్థి గర్జన జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ లగడపాటి హాజరయ్యారు. ఉద్యోగులు , ఉపాద్యాయులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, న్యాయవాదులు ఉవ్వెత్తున సాగిస్తున్న ఉద్యమంలో ప్రజాసంఘాలు కలిసి వస్తున్నారు. మేము సైతం అంటూ పోరుపథంలో ముందకు ఉరుకుతున్నారు. ఎక్కడికక్కడ నిరసన, ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూ సమైక్యవాణిని బలంగా వినిపిస్తున్నారు.
అదనపు బాదుడు
ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేటు వాహనదారులు, ఆటోల నుంచి బస్సుల వరకు అందరిదీ అదే దారి. సమైక్యాంద్ర ఉద్యమం నేపథ్యంలో ఆటోలు, ప్రైవేటు బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఉపేక్షించేంది లేదు. సాధారణ రోజుల్లో ఎంత వసూలు చేసే వారో ఇప్పుడు అంతే మొత్తం తీసుకోవాలి . లేని పక్షంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తాం. వాహనాలు సీజ్ చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం. నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆటో డ్రైవర్లు , ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులతో వారం రోజుల కిందట ప్రత్యేకంగా సమావేశమై చేసిన హెచ్చరికలివి. తొలి రోజునేర అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఎన్నిమిది మంది ఆటోడ్రైవర్ల పై కేసులు కూడా నమోదు చేశారు. అయినా కొంత మంది ఆటోడ్రైవర్లు, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు, ఇతర ప్రైవేటు ఆపరేటర్ల తీరు మాత్రం మారడం లేదు. ఆర్టీసి సమ్మె నేపథ్యంలో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా చేసుకుని వాస్తవ ఛార్జీల కంటే రెండు మూడు రెట్ల మేర అధికంగా వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more