పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు పడుతున్నాయి.. ప్రజలను ప్రసన్నంచేసుకునేందుకు నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటించాల్సిఉండగా సమైక్యాంధ్ర ఉద్యమం వైపే పరుగులుతీయాల్సి వస్తోంది.. అయినా విభజన ఆగే సూచనలు కనిపించడంలేదు.. సమైక్యాంధ్రకు హీరో ముఖ్యమంత్రేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలుంటుండగా, కాదు ముమ్మాటికీ జగనేనని ఆ పార్టీవారంటున్నారు.. ఇక టిడిపి సమన్యాయం సిద్దాంతో ముందుకెళుతున్నందు చం ద్రబాబే హీరో అంటున్నారు. ఈ ముగ్గురిలో సమైక్యంద్ర హీరో ఎవరు అనేది ప్రజలే త్వరలో తేల్చుతారు.
ఓటర్ల నమోదు గడువు పొడిగింపు
ఓటర్ల నమోదు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఈ నెల 17వ తేదీ వరకే ఓటర్ల నమోదు గడువు ఉండడంతో మంగళవారం నాడు నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు ఓటర్ల నమోదు కేంద్రాలు అన్ని కిటకిట లాడాయి. ఓటు నమోదు చేసుకోవాల్సిన యువతీ యువకుల సంఖ్య భారీగా ఉండడంతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ) అయిన నగరపాలకసంస్థ కమిషనర్ హరికిరణ్ ఓటర్ల నమోదు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించామని తెలిపారు.
23వ తేదీ వరకు అన్ని ఓటర్ నమోదు కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు లభ్యమవుతాయని, అదే మాదిరిగా అన్ని కళాశాలలు, హైస్కూళ్లలో కూడా ఓటర్ నమోదు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచామని హరికిరణ్ తెలిపారు. ఆదివారం సెలవు దినం అయినందున ఆ రోజున అన్ని ఓటర్ నమోదు కేంద్రాల్లో బోర్ట్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు. ఓటర్గా నమోదు చేయించు కోదలచిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగంచు కోవాలని హరికిరణ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more
Nov 28 | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఉమా మాట్లాడుతూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల మధ్య చిచ్చుపెట్టే... Read more