విభజనపై బీజేపీ తన విధానం మార్చుకుంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఆపే శక్తి కేంద్రంలోని ప్రతిపక్ష బీజేపీకి ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ యూటర్న్ తీసుకుంటే రాష్ట్రం విడిపోదని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులకు న్యాయం జరగాలంటే యూటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లేవారంతా అధికారం కోసమే వీడుతున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలు గౌరవవించకుంటే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. మంత్రుల బృందం (జీవోఎం)ను మరోసారి కలిసి తమ అభిప్రాయాలు తెలియజేయనున్నట్టు కృపారాణి వెల్లడించారు.
రూ. కోటిన్నర పట్టివేత
చిత్తూరు జిల్లాలోని వెదరుకుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 టన్నుల ఎర్రచందనాన్ని ఈ రోజు తెల్లవారుజామున పటుకున్నట్లు అటవీశాఖ అధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు. అందుకు సంబంధించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రధమం అని అటవీశాఖ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. కోటిన్నర వరకు ఉంటుందని చెప్పారు. స్మగ్లర్లను పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఎర్రచందనాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలను పోలీసు స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more