Samaikyandhra bandh effect activists set car on fire

Samaikyandhra bandh effect, bandh effect activists set car on fire, Samaikyandhra bandh effect activists set car on fire, panchayat results, 72 hours seemandhra bandh,

Samaikyandhra bandh effect activists set car on fire, Samaikyandhra bandh effect

తిరుపతిలో కారు దాహనం-కొనసాగుతున్న బంద్

Posted: 07/31/2013 04:20 PM IST
Samaikyandhra bandh effect activists set car on fire

చిత్తూరుజిల్లాలో నిరసన జ్వాలలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. గాంధీ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే సికె బాబు బైఠాయించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు తిరుపతిలో ఒక కారును తగులబెట్టారు. సోనియా గాంధీదిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. పోలీసులు వారిని చెదరగొడుతున్నారు. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి దీక్ష ప్రారంభించారు.విద్యాసంస్థలు, దుకాణాలు మూతబడ్డాయి. రాత్రి నుంచి ఆర్టీసి బస్సులను నిలిపేశారు. తిరుమలకు మినహా, మిగిలిన అన్నిచోట్లకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. తమిళనాడు సరిహద్దుల్లో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయాయి. మరోవైపు మదనపల్లి డివిజన్‌లో గల 31 మండలాల్లోని 469 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బంద్ ప్రభావం ఎన్నికలపై పడుతోంది.

 

93 శాతం పోలింగ్ నమోదు

రొంపిచర్ల మండలంలోని అన్ని గ్రామాల్లో మూడోవిడద పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా జరిగాయి. బోడిపాటి వారి పంచాయతీలో 93 శాతం ఓట్లు పోలయినట్లు ఎన్నికల అధకారుల తెలియజేశారు.

 

పుత్తూర్ లో ప్రశాంతంగా బంద్

పుత్తూరు పట్టణంలో సమైక్యాంద్ర బంద్ ప్రశాంతంగా సాగుతుంది బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు ఢిపోకే పరిమితమయ్యాయి. దీంతో ఆడిక్రుత్రిక సందర్భంగా తిరుత్తణి వెళ్లే భక్తులకు ఇబ్బంది ఏర్పడింది. పట్టణంలో వివిధ పార్టీల నేతలు టెంట్లు ఏర్పాటు చేసి శాంతియుతంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేచసుకోకుండా సీఐ చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

 

వైకాపా మద్దతుదారునిపై దాడి

తంబళ్లపల్లి ముల్కల చెరువు మండలంలోని సోంపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారునిపై ప్రత్యర్థి వర్గాలు దాడి చేశాయి. దీంతో వైకాపా మద్దతుదారుడికి స్వల్పంగా గాయాలయ్యాయి.

 

తిరుపతిలో బంద్

కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తిరుపతిలో సమైక్యవాదులు బంద్ పాటిస్తున్నారు. తిరుపతి బస్టాండ్ లో ఆర్టీసీ బస్సుల టైర్లలో గాలి తీసి నిరసన తెలిపారు.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles