ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి.. తన సత్తాను చాటింది. బ్యాటింగ్లో దూబె, ఉత్తప్ప.. బౌలింగ్లో తీక్షణ మెరవడంతో తన 200వ ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరుపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన ఆర్సీబీ చివరి వరకూ పోరాడినా 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేసింది.
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పవర్ ప్లే ముగిసేలోపే కోలుకోలేని దెబ్బ పడింది. స్కోరు 14 పరుగులకే చేరే సరికే కెప్టెన్ డుప్లెస్సి (8) ఔటయ్యాడు. స్పిన్నర్ మహీష్ తీక్షణ చెన్నైకి తొలి బ్రేక్ సాధించిపెట్టాడు. ఆ వెంటనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (1) కూడా ఔటవడంతో ఆర్సీబీ అభిమానులు దాదాపుగా మ్యాచ్పై ఆశలు వదిలేసుకున్నారు. కాసేపటికి మరో ఓపెనర్ అనూజ్ రావత్ (12) ఔటయ్యాడు. ఈ గ్యాప్లో గ్లెన్ మ్యాక్స్వెల్ కాసేపు మెరుపులు మెరిపించాడు. అతడు 11 బంతుల్లోనే 2 సిక్స్లు, 2 ఫోర్లతో 26 రన్స్ చేసి ఔటయ్యాడు.
దీంతో 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బెంగళూరు. ఇక మ్యాచ్ ముగియడానికి ఎంతోసేపు పట్టదనుకున్న సమయంలో తొలి మ్యాచ్ ఆడుతున్న సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ కలిసి కాసేపు ఆర్సీబీ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేశారు. ఈ ఇద్దరూ సీఎస్కే బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 33 బంతుల్లోనే ఐదో వికెట్కు 60 పరుగులు జోడించారు. ప్రభుదేశాయ్ 18 బంతుల్లో 34 రన్స్ చేసి తీక్షణ బౌలింగ్లో ఔటయ్యాడు. తర్వాత కాసేపటికి షాబాజ్ కూడా 27 బంతుల్లో 41 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
ఉతికారేసిన దూబె, ఉతప్ప
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లను ఊచకోత కోశారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు రాబిన్ ఉతప్ప, శివమ్ దూబె. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 216 రన్స్ చేసింది. ఉతప్ప, దూబె కలిసి మూడో వికెట్కు 80 బంతుల్లోనే 165 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలోనే చెన్నై 83 రన్స్ చేయడం విశేషం. శివమ్ దూబె 46 బంతుల్లో 8 సిక్స్లు, 5 ఫోర్లుతో 94 రన్స్ చేశాడు. అటు ఉతప్ప కూడా కేవలం 50 బంతుల్లోనే 9 సిక్స్లు, 4 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్లో ఇవే అత్యధిక వ్యక్తిగత స్కోర్లు కావడం విశేషం. వీళ్ల దెబ్బకు ఆర్సీబీ బౌలర్ ఆకాశ్ దీప్ 4 ఓవర్లలోనే 58 పరుగులు సమర్పించుకున్నాడు.
పది ఓవర్ల వరకూ చెన్నై స్కోరు 2 వికెట్లకు 60 పరుగులు. వీరిద్దరూ జతకలవడంతో కూడబలుకుకుని అర్సీబి బౌలర్లను ఉతికి ఆరేసినట్లు అనిపించింది. నాలుగు మ్యాచ్లుగా బోణీ కోసం ఎదురు చూసిన చెన్నై టీమ్కు ఈ గెలుపు ఉత్సాహాన్ని అందించింది. అయితే మ్యాచ్ కు మంచి ఆరంభం లభించకపోయినా..36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో వున్నా ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఉతప్ప, శివమ్ దూబె కూడా మొదట్లో వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. పది ఓవర్ల తర్వాత ప్రారంభమైన బాదుడు.. ఇన్నింగ్స్ మొత్తం కొనసాగింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more