ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్ట్ అర్ధంతరంగా రద్దయిన సంగతి తెలుసు కదా. కరోనా భయంతో టీమిండియా ప్లేయర్స్ చివరి టెస్ట్ ఆడటానికి నిరాకరించారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. నాలుగు టెస్ట్లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 లీడ్లో ఉంది. ఇప్పుడు ఆ చివరి టెస్ట్ జరుగుతుందా లేదా.. జరిగితే ఏకైక టెస్ట్లా జరుగుతుందా లేక ఈ సిరీస్లో భాగంగానా అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే దీనిపై తాజాగా ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్లో నిజమైన విజేత ఇండియానే అని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే తుది ఫలితం మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ, ఐసీసీ తేలుస్తాయని చెప్పాడు.
ఈ సిరీస్లో ఇండియా తరఫున అత్యధిక స్కోరర్ రోహిత్ శర్మనే. నా దృష్టిలో ఈ సిరీస్ మేము గెలిచాము. చివరి టెస్ట్ సంగతేంటో నాకు తెలియదు. దానిని ఏకైక టెస్ట్లాగా ఆడతామా.. దాంతోనే సిరీస్ నిర్ణయిస్తారా తెలియదు. దానిప ఎలాంటి స్పష్టత లేదు అని రోహిత్ అన్నాడు. సోమవారం అడిడాస్ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సిరీస్లో రోహిత్ 52 సగటుతో 368 రన్స్ చేశాడు. అంతేకాదు ఇదే సిరీస్లో ఇండియా బయట టెస్టుల్లో తన తొలి సెంచరీ కూడా చేయడం విశేషం. ఇంగ్లండ్ టూర్ తనకు బాగుందని, అయితే ఇదే ఉత్తమమని మాత్రం తాను చెప్పలేనని అన్నాడు. టెస్ట్ క్రికెట్లో తన బెస్ట్ రానుందని చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more