పర్యాటక జట్టు ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56 ఓవర్లలోనే టీమిండియా బౌలర్లు చాపచుట్టించేశారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ నుంచే టీమిండియా ఇంగ్లాండ్ పై పేచేయి సాధించాలన్న పట్టుదలతో వుంది. ఫలితంగా చెన్నైలో రెండు ఇన్నింగ్స్ లో నిలదొక్కుకోలేక అత్యంత తొందరగా చాపచుట్టేసింది.
తొలిఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బకొట్టాడు. వారికి తోడు రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితం... టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 329, రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 134, రెండో ఇన్నింగ్స్లో 164 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లో బర్న్స్ 25, సిబ్లీ 3, లారెన్స్ 26, జాక్ లీచ్ 0, కెప్టెన్ రూట్ 33, బెన్ స్టోక్స్ 8, పోప్ 12, బెన్ ఫోక్స్ 2 , మోయీన్ అలీ 43, స్టోన్ 0, బ్రాడ్ 5 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టి టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్లో శతకంతో అదరగొట్టిన అశ్విన్పై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది.
రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా ఎవ్వరూ రాణించలేదని బావిస్తున్న తరుణంలో తన హోం గ్రౌండ్ లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అశ్విన్. ఓ వైపు బంతితోనూ రాణిచిన అశ్విన్.. ఈ టెస్టులో బ్యాటుతోనూ రాణించాడు. మరోలా చెప్పాలంటే చెన్నై రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తరపున శతకం బాదిన హీరోగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 26, శుభ్మన్ గిల్ 14, పుజారా 7, కోహ్లీ 62, పంత్ 8, రహానె 10, అక్షర్ పటేల్ 7, అశ్విన్ 106 కుల్దీప్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 7, సిరాజ్ 16 పరుగులు చేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more