India Crush England by 317 Runs in Chennai Test ఇంగ్లాండ్ పై టీమిండియా ప్రతీకారం.. చెన్నై టెస్టులో భారీ విజయం

India vs england 2nd test day 4 india beat england by 317 runs to level series 1 1

India vs England 2nd Test Day 4 Score, India vs England 2nd Test Day 4, England vs India 2nd Test, IND vs ENG 2nd Test Day 4 Live, Day 4 2nd Test, Chennai Test, Chennai Weather Forecast, Chennai Rain prediction, IND vs ENG Chennai Test, IND vs ENG test, India vs England 2021 final date, India vs England 2021 news, India vs England 2021 latest news, India vs England 2021 schedule, India vs England teams, IND vs ENG Test, IND vs ENG Test Schedule, IND vs ENG Match Scorecard, India vs England 2021 fixture list, India vs England 2021 points table,

India wrapped up England’s second innings inside 55 overs as they were bowled out for 164. With this win, India have levelled the series at one-all and are still alive in the hunt for a final spot at the inaugural ICC World Test Championship set to be played later this year.

ఇంగ్లాండ్ పై విరాట్ సేన ప్రతీకారం.. చెన్నై టెస్టులో భారీ విజయం

Posted: 02/16/2021 03:34 PM IST
India vs england 2nd test day 4 india beat england by 317 runs to level series 1 1

పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జ‌రిగిన‌ రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56 ఓవర్లలోనే టీమిండియా బౌలర్లు చాపచుట్టించేశారు. భార‌త బౌల‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఎవ‌రూ క్రీజులో నిల‌దొక్కుకోలేక‌పోయారు. తొలి ఇన్నింగ్స్‌ నుంచే టీమిండియా ఇంగ్లాండ్ పై పేచేయి సాధించాలన్న పట్టుదలతో వుంది. ఫలితంగా చెన్నైలో రెండు ఇన్నింగ్స్ లో నిలదొక్కుకోలేక అత్యంత తొందరగా చాపచుట్టేసింది.

తొలిఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసిన అక్ష‌ర్ ప‌టేల్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ప‌డ‌గొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బ‌కొట్టాడు. వారికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 164 పరు‌గుల‌కే ఆలౌట్ అయింది. ఫ‌లితం... టీమిండియా 317 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌‌ను భార‌త్‌ 1-1తో సమం చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 329, రెండో ఇన్నింగ్స్‌లో 286 ప‌రుగులు చేసి ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134, రెండో ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో  బ‌ర్న్స్ 25, సిబ్లీ 3, లారెన్స్ 26, జాక్ లీచ్ 0, కెప్టెన్ రూట్ 33, బెన్ స్టోక్స్ 8, పోప్ 12, బెన్ ఫోక్స్ 2 , మోయీన్ అలీ 43, స్టోన్ 0, బ్రాడ్ 5 ప‌రుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ కొట్టి టీమిండియా గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన రోహిత్ శ‌ర్మ, రెండో ఇన్నింగ్స్‌లో శ‌త‌కంతో అద‌ర‌గొట్టిన అశ్విన్‌పై స‌ర్వ‌త్ర ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా ఎవ్వరూ రాణించలేదని బావిస్తున్న తరుణంలో తన హోం గ్రౌండ్ లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అశ్విన్. ఓ వైపు బంతితోనూ రాణిచిన అశ్విన్.. ఈ టెస్టులో బ్యాటుతోనూ రాణించాడు. మరోలా చెప్పాలంటే చెన్నై రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తరపున శతకం బాదిన హీరోగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మ 26, శుభ్‌మ‌న్ గిల్ 14, పుజారా 7, కోహ్లీ 62, పంత్ 8, ర‌హానె 10, అక్ష‌ర్ పటేల్ 7, అశ్విన్ 106 కుల్‌దీప్ యాద‌వ్ 3, ఇషాంత్ శ‌ర్మ 7, సిరాజ్ 16 ప‌రుగులు చేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  England  India vs England  Ind vs Eng  score  chennai test  2nd test  3rd test  ahmedabad test  cricket  sports  

Other Articles