బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్ పట్టడానికి వికెట్ కీపింగ్ చేస్తున్న ముష్ఫికర్ రహీమ్ ప్రయత్నించాడు. అదే క్యాచ్ అందుకోవడానికి ఫీల్డర్ నసూమ్ అహ్మద్ కూడా వచ్చాడు. దాంతో ఇద్దరూ ఢీ కొట్టుకునేంత ప్రమాదం ఏర్పడింది. దాంతో నసూమ్ పై కోపోద్రిక్తుడయ్యాడు. 'కొడతా నిన్ను..' అనే స్థాయిలో హావభావాలు ప్రదర్శించాడు. అయితే నసూమ్ మాత్రం ఎంతో సంయమనం పాటించి గొడవ పెద్దది కాకుండా చూశాడు.
"MY catch" #Cricket pic.twitter.com/CodLbaVSip
— Saj Sadiq (@Saj_PakPassion) December 14, 2020
ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముష్ఫికర్ పై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో తన చర్యకు ముష్ఫికర్ పశ్చాత్తాపం ప్రకటించాడు. "నా ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు అందరికీ క్షమాపణలు తెలుపుకుంటున్నా. ఇప్పటికే నా జట్టు సహచరుడు నసూమ్ కు సారీ చెప్పాను. నేను కూడా మానవమాత్రుడ్నే. నేను చేసిన పని ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అయితే మరోసారి ఇలాంటి తప్పు జరగదని స్పష్టం చేస్తున్నా" అని వివరణ ఇచ్చాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముష్ఫికర్ రహీమ్ మ్యాచ్ ఫీజు నుంచి పావుభాగం జరిమానాగా విధించింది.
Not only once, Mushfiqur did it twice pic.twitter.com/zpSriYRYhY
— cricket videos (@middlestump5) December 16, 2020
(And get your daily news straight to your inbox)
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more
Nov 28 | తన జట్టును ఓటమి నుంచి కాపాడేందుకు ఓ బ్యాట్స్ మెన్ ఎం చేయగలడో అదే టీమిండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య చేశాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కొనియాడాడు. భారత జట్టుకు... Read more