దులీప్ ట్రోఫీలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ వెళ్లిన దాదాపు వందమందికిపైగా క్రికెటర్లను రెండు రోజుల క్రితం ప్రభుత్వం వెనక్కి పంపింది. జమ్మూకాశ్మీర్ లోని పర్యాటకులను, విద్యార్థులను పంపినట్టుగానే వీరిని అక్కడి నుంచి వెనక్కి పంపింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో భద్రతా కారణాల రీత్యా వీరందరినీ వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కోరడంతో వీరంతా కశ్మీర్ను విడిచిపెట్టారు.
అలా వెనక్కి వచ్చిన వారిలో టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కోచ్ మిలాప్ మేవడా, ట్రైనర్ సుదర్శన్ కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ స్పందిస్తూ.. తన మనసు, హృదయం రెండూ కశ్మీరీలతోనే ఉన్నట్టు పేర్కొన్నాడు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కశ్మీరీ సోదరులు, అక్కచెల్లెళ్ల కోసం అవి తపిస్తున్నాయని పేర్కొంటూ కశ్మీర్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
జమ్ముకశ్మీర్ జట్టు ఆటగాడిగా, మెంటార్గా ఇర్ఫాన్ సేవలందిస్తున్నాడు. దులిప్ ట్రోఫీ కోసం జమ్మూకాశ్మీర్ కు వెళ్లిన ఆయనతో పాటు అనేక మంద్రి క్రీడాకారులు ప్రస్తుతం అక్కడ నెలకోన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి వచ్చేశారు. కాగా, ఈ నెల 17 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుండగా అది ముగిసిన వెంటనే విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీలు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more