ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లకు మంచి స్థానాలు దక్కాయి. బౌలింగ్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కెరీర్ బెస్ట్ రెండోస్థానంలో నిలిచాడు. మరోవైపు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగు పరుచుకుని ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీమిండియా రెండు పాయింట్లు కోల్పోయినప్పటికీ రెండో స్థానాన్ని కాపాడుకోగలిగింది. తొలిస్థానంలో పాకిస్థాన్ నిలిచింది.
బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ కెరీర్లో అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలవగా, ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ర్యాంకుల్లో కుల్దీప్ మినహా టాప్-10లో టీమిండియా బౌలర్లెవరూ చోటు దక్కించుకోలేదు. కుల్దీప్ బౌలింగ్ భాగస్వామి, స్పిన్ మాయగాడు యుజువేంద్ర చాహల్ ఆరు స్థానాలు దిగజారి 17వ స్థానంతో సరిపెట్టుకొన్నాడు. మరో బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాత్రం 18వ స్థానంలో కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో స్థానంలో నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ 10వ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఇది తన ర్యాంకు పై ప్రభావం చూపింది. దీంతో కోహ్లీ 19వ స్థానానికి పడిపోయాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more