IPL Matches Moved Out Of Chennai Amid Cauvery Protests భద్రతా కారణాల దృష్ట్యా.. చెన్నై నుంచి తరలిపోతున్న మ్యాచులు..

Ipl matches scheduled for chennai to be shifted amid cauvery protests

ipl, ipl 2018, csk, chennai, no matches in chennai, chennai super kings, matches shifted from chennai, bcci, bcci shifts matches from chennai, ipl 2018 news, ipl news, indian premier league, sports news, cricket news, latest cricket news, latest sports news, sports, cricket

The BCCI has reportedly decided to move the matches scheduled to be held in Chennai’s Chepauk Stadium to another venue following the Cauvery protests

చెన్నై నుంచి మ్యాచులు ఔట్.. హైదరాబాద్, విశాఖలకు తరలింపు.?

Posted: 04/11/2018 06:59 PM IST
Ipl matches scheduled for chennai to be shifted amid cauvery protests

చెన్నై వేదికగా జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను జరగబోనివ్వమని నామ్ తమిజార్ కట్చి నేతలు, నిర్వహకులను హెచ్చరించిన నేపథ్యంలో.. దీనిపై దృష్టి సారించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. చెన్నై వేదకను రద్దు చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. బీసీసీఐ కూడా తమిళుల డిమాండ్లకు తలొగ్గినట్లు వస్తున్న విమర్శల నేపథ్యంలో.. వారు స్పందించారు. తమ ఆటగాళ్ల భద్రత తమకు ముఖ్యమని, ఆటగాళ్ల భద్రతకు విఘాతం ఏర్పడితే.. అది సహేతుకం కాదని అభిప్రాయపడిన బోర్డు..  చెన్నైలో జరగవలసిన 7 క్రికెట్ మ్యాచులను ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు షురూ చేసింది.

కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళులు ఐపీఎల్ ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాట ఈ డిమాండ్ తో భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఎస్కే మ్యాచ్ సమయంలో చెప్పు విసిరిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ-ఐపీఎల్ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోందని, చెన్నైకు సరైన ప్రత్యామ్నాయ మైదానాలపై చర్చ జరుగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కాగా, చెన్నైలో జరగాల్సిన మ్యాచులను హైదరాబాద్, వైజాగ్ లలో నిర్వహించేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇవాళ జరుగుతున్న బీసీసీఐ-ఐపీఎల్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు స్పష్టత రానున్నట్లు సమాచారం. వారం నుంచి తమిళనాడులో జరుగుతున్న నిరసనలను, చెన్నైలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రతా కారణాలతో చెన్నైలో జరగవలసిన 6 ఐపీఎల్ మ్యాచులను వేరొక చోటుకు తరలించనున్నారని  తెలుస్తోంది. హైదరాబాద్, వైజాగ్ లలోని మైదానాలు, భద్రత పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో మహారాష్ట్రలోని రైతాంగానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని అక్కడ జరగాల్సిన మ్యాచ్ లను ఇతర ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2018  csk  chennai  matches  cricketers  security  chidambaram stadium  sports  cricket  

Other Articles