చెన్నై వేదికగా జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను జరగబోనివ్వమని నామ్ తమిజార్ కట్చి నేతలు, నిర్వహకులను హెచ్చరించిన నేపథ్యంలో.. దీనిపై దృష్టి సారించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. చెన్నై వేదకను రద్దు చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. బీసీసీఐ కూడా తమిళుల డిమాండ్లకు తలొగ్గినట్లు వస్తున్న విమర్శల నేపథ్యంలో.. వారు స్పందించారు. తమ ఆటగాళ్ల భద్రత తమకు ముఖ్యమని, ఆటగాళ్ల భద్రతకు విఘాతం ఏర్పడితే.. అది సహేతుకం కాదని అభిప్రాయపడిన బోర్డు.. చెన్నైలో జరగవలసిన 7 క్రికెట్ మ్యాచులను ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు షురూ చేసింది.
కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళులు ఐపీఎల్ ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాట ఈ డిమాండ్ తో భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఎస్కే మ్యాచ్ సమయంలో చెప్పు విసిరిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ-ఐపీఎల్ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోందని, చెన్నైకు సరైన ప్రత్యామ్నాయ మైదానాలపై చర్చ జరుగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాగా, చెన్నైలో జరగాల్సిన మ్యాచులను హైదరాబాద్, వైజాగ్ లలో నిర్వహించేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇవాళ జరుగుతున్న బీసీసీఐ-ఐపీఎల్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు స్పష్టత రానున్నట్లు సమాచారం. వారం నుంచి తమిళనాడులో జరుగుతున్న నిరసనలను, చెన్నైలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రతా కారణాలతో చెన్నైలో జరగవలసిన 6 ఐపీఎల్ మ్యాచులను వేరొక చోటుకు తరలించనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్, వైజాగ్ లలోని మైదానాలు, భద్రత పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో మహారాష్ట్రలోని రైతాంగానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని అక్కడ జరగాల్సిన మ్యాచ్ లను ఇతర ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more