అప్పట్లో విరాట్ కోహ్లీని అడ్డుకున్నది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే అంటూ గతానికి సంబంధించిన అంశాలను గుర్తుకుతెచ్చుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కర్. ఇప్పుడు టీమిండియా జట్టు సారధిగా వున్న విరాట్ కోహ్లీకి విజయానికి కీలక సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ధోని.. తొలినాళ్లలో కోహ్లీని జట్టులోకే రానీయకుండా అడ్డుకున్నాడని వెంగ్ సర్కార్ అన్నాడు. కోహ్లీని జట్టులోకి సిఫార్సు చేసినందుకుగాను తన పదవికే ఎసరు వచ్చిందని ఆయన తన అవేదనను వ్యక్తం చేశారు.
సరిగ్గా పదేళ్ల ముందు 2008లో టీమిండియా శ్రీలంక పర్యటనకు జట్టును ఎంపిక చేస్తున్న క్రమంలో కోహ్లీ పేరును తాను సిఫార్సు చేశానని వెంగసర్కార్ అన్నారు. అందుకు ఆ ఏడాది కోహ్లీ నాయకత్వంలోని అండర్-19 భారత జట్టు ప్రపంచకప్ గెలివడమే కాకుండా.. ఇండియా-ఎ తరఫున బ్రిస్బేన్ మ్యాచులో కోహ్లీ 123 పరుగులతో నాటౌట్ గా నిలివడం కూడా కారణమని చెప్పానన్నాడు. అయితే తన నిర్ణయాన్ని.. అప్పటి కోచ్ గ్యారీ కిర్స్టన్, కెప్టెన్ ధోనీ ఒప్పుకోలేదని అన్నాడు. బద్రీనాథ్ పై వేటు పడుతుందనే వారు దానిని అడ్డుకున్నారని, ఈ విషయంలో శ్రీనివాసన్ తనను ప్రశ్నించారని కూడా చెప్పుకోచ్చారు వెంగ్ సర్కార్.
అంతకు ముందు జరిగిన ఓ టోర్నీలో బద్రీనాథ్ 800 పరుగులు చేశాడు. మరి అతనికి ఎందుకు స్థానం ఇవ్వకూడదు అని తనతో వాదనకు కూడా దిగాడని, అయితే అతనికి కూడా అవకాశం ఇస్తానని చెప్పగా, ఇప్పటికే అతని వయస్సు 29.. ఇక మీరు అవకాశం ఇచ్చే నాటికి ముఫై కూడా రావచ్చు. క్రీడాకారుడి జీవితం, భవిష్యత్తుతో అటలు వద్దు అంటూ వాదించాడని వెంగీ చెప్పుకోచ్చారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు. ఆ మరుసటి రోజే శ్రీకాంత్ను తీసుకొచ్చి సెలక్టర్గా నియమించి నా కాల పరిమితి ముగిసిందని చెప్పారని గుర్తుచేసుకున్నాడు వెంగ్ సర్కార్.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more